E-Paper
Advertisement

Rangareddy News: హైదరాబాద్-బీజాపూర్ హైవే పై ఘోర ప్రమాదం.. ఢీకొన్న రెండు కార్లు, స్పాట్‌లో

Rangareddy News: హైదరాబాద్-బీజాపూర్ హైవే పై ఘోర ప్రమాదం..  ఢీకొన్న రెండు కార్లు, స్పాట్‌లో
Advertisement

Rangareddy News: రంగారెడ్డి జిల్లా మెయినాబాద్ మండల కనకమామిడి వద్ద ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఎదురెరుదుగా వచ్చిన రెండు కార్లు ఢీ కొన్నాయి. ఈ ఘటనలో అక్కడికక్కడే ఇద్దరు మృతి చెందారు. మరో ముగ్గురు పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.

అతి వేగం ప్రమాదకరమని పదేపదే పోలీసులు చెబుతున్నాయి. అయినా ఏ మాత్రం వాహనదారులు లెక్క చేయడం లేదు. ఫలితంగా రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా శుక్రవారం ఉదయం రంగారెడ్డి జిల్లా మెయినాబాద్ మండల కనకమామిడి వద్ద ఘోర ప్రమాదం చోటు చేసుకుంది.

Advertisement

హైదరాబాద్-బీజాపూర్ జాతీయ రహదారిపై ఎదురెరుదుగా వచ్చిన రెండు కార్లు ఢీ కొన్నాయి. ఈ ఘటనలో అక్కడికక్కడే ఇద్దరు మృతి చెందారు. మరో ముగ్గురు పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఘటన గురించి సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు అక్కడికి చేరుకున్నారు. వెంటనే సహాయక చర్యలు చేపట్టారు.

స్పాట్‌లో ఒకరు మృతి చెందగా, మరొకరు ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటూ చనిపోయారు. గాయపడిన నలుగురిలో ముగ్గురు పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటనలో కారు ముందు పార్ట్ నుజ్జు నుజ్జు అయ్యింది. పోలీసులు వెళ్లి అందులోని వ్యక్తులను బయటకు తీశారు. అయితే వారంతా ఎక్కడివారు? ఎటువైపుకు వెళ్తున్నారు? అనేది తెలియాల్సివుంది.

Advertisement

ప్రమాదం నేపథ్యంలో ఆ ప్రాంతంలో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. వాహనాలను పక్కకు తొలగించి ట్రాఫిక్ ని క్లియర్ చేశారు పోలీసులు. అతి వేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు భావిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

 

Related News

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

Big Stories

Advertisement
×