E-Paper
Advertisement

Babar Azam: పాకిస్తాన్ ను ‘Pakistam’ చేసిన ద‌ద్ద‌మ్మ‌…బాబ‌ర్ పై దారుణంగా ట్రోలింగ్స్

Babar Azam: పాకిస్తాన్ ను  ‘Pakistam’ చేసిన ద‌ద్ద‌మ్మ‌…బాబ‌ర్ పై దారుణంగా ట్రోలింగ్స్
Advertisement

Babar Azam: పాకిస్తాన్ మాజీ కెప్టెన్ బాబర్ ఆజం ( Babar Azam) మరోసారి ట్రోలింగ్ కు గురయ్యాడు. పాకిస్తాన్ క్రికెటర్లు ఏది చేసినా వైరల్ గానే మారుతుంది. అయితే తాజాగా సెంచరీ హీరో బాబర్ ఆజం తమ దేశం పాకిస్తాన్ పేరు సరిగ్గా రాయలేక పరువు తీసుకున్నాడు. పాకిస్తాన్ ( Pakistan) స్థానంలో పాకిస్తామ్ ( Pakistam ) అంటూ రాసి, అడ్డంగా దొరికిపోయాడు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. ఈ వీడియోను చూసిన నెటిజెన్స్ ఓ రేంజ్ లో ఆడుకుంటున్నారు. ఒరేయ్ దద్దమ్మ మీ దేశం పేరు నీకే రాయడం చేతకాకపోతే ఎలా రా ? ఇక ఇండియా పైన యుద్ధం చేస్తామని విర్రవీగుతారు.. మీరు చేతకాని దద్దమ్మలు అంటూ బాబర్ ఆజంను ఉద్దేశించి ఇండియన్స్ అయితే ఓ రేంజ్ లో ఆడుకుంటున్నారు.

Also Read: Asia Cup Rising Stars 2025: టీమిండియా వ‌ర్సెస్ బంగ్లా మ‌ధ్య సెమీస్‌..పాకిస్తాన్ మ్యాచ్ కూడా, టైమింగ్స్‌, ఉచితంగా ఎలా చూడాలంటే

సెంచరీతో రెచ్చిపోయిన బాబర్ ఆజం

Advertisement

పాకిస్తాన్ వర్సెస్ శ్రీలంక ( Pakistan VS Sri Lanka ) మధ్య రావల్పిండి ( Rawalpindi Cricket Stadium) వేదికగా మూడు వ‌న్డేలు జరిగాయి. ఈ మూడు వన్డే మ్యాచ్ లలో కూడా పాకిస్తాన్ వరుసగా విజయాలను నమోదు చేసుకుంది. ఈ దెబ్బకు మూడు వ‌న్డేల‌ సిరీస్ కూడా పాకిస్తాన్ కైవసం చేసుకోవడం గమనార్హం. వాస్తవంగా ఈ టోర్నమెంట్ జరుగుతుందో లేదో అనే టెన్షన్ లోనే చకచకా నిర్వహించేశారు. అయితే పాకిస్తాన్ వర్సెస్ శ్రీలంక మధ్య జరిగిన రెండవ వన్డే మ్యాచ్ లో బాబర్ ఆజం అదిరిపోయే సెంచరీతో మళ్ళీ ఫామ్ లోకి వచ్చాడు. 119 బంతుల్లోనే 102 పరుగులు చేసి జట్టును విజయతీరాలకు చేర్చాడు. ఈ మ్యాచ్ లో మొదటి బ్యాటింగ్ చేసిన శ్రీలంక నిర్ణీత 50 ఓవర్స్ లో 8 వికెట్లు నష్టపోయి 288 పరుగులు సాధించింది. ఇక ఆ లక్ష్యాన్ని 48.2 ఓవర్స్ లో కేవలం రెండు వికెట్లు నష్టపోయి పాకిస్తాన్ ఛేదించింది. ఈ మ్యాచ్లో పాకిస్తాన్ ఓపెనర్ ఫకర్ జమాన్ 78 పరుగులు చేయగా ఆయూబ్ 33 పరుగులతో రాణించారు. మూడవ వికెట్ కు వచ్చిన బాబర్ ఆజం 102 పరుగులు చేయగా మహమ్మద్ రిజ్వాన్ 51 పరుగులతో నిచ్చిపోయారు. దీంతో పాకిస్తాన్ విజయం సాధించింది.

రావాల్పిండిలో సంతకం చేసిన బాబర్ అజం

లార్డ్స్ తరహాలోనే రావాల్పిండిలో ( Rawalpindi Cricket Stadium) సెంచరీ చేస్తే అక్కడ ఉన్న అక్క‌డ ఉన్న‌ బోర్డుపై ఆ ప్లేయర్ పేరుతో పాటు సంతకం చేయాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలోనే రావాల్పిండిలో ఉన్న బోర్డుపై బాబర్ ఆజం తన వివరాలను రాసుకొచ్చాడు. తన పేరు అలాగే సెంచరీ వివరాలు కరెక్ట్ గా రాసిన బాబ‌ర్‌, పాకిస్తాన్ పేరు మాత్రం తప్పుగా రాశాడు. పాకిస్తాన్ పేరును పాకిస్తామ్ అని రాసి అడ్డంగా దొరికిపోయాడు. ఇప్పటికే మనోడికి ఇంగ్లీష్ మాట్లాడడం రాదంటే, ఇప్పుడు ఇంగ్లీష్ రాయడం కూడా రాదని దారుణంగా ట్రోలింగ్ చేస్తున్నారు.

Advertisement

Related News

సెంచ‌రీ చేసినా రోహిత్ శ‌ర్మ‌పై ఆగ‌ని ట్రోలింగ్…స్లో బ్యాటింగ్ అంటూ వాయించేస్తున్నారుగా

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 విజేతగా స్పెయిన్‌..ఏకంగా 16 ఏళ్ల త‌ర్వాత స‌రికొత్త చ‌రిత్ర‌

రోహిత్ శ‌ర్మ లార్డ్స్ సెంచ‌రీ వెనుక సీక్రెట్ ఇదే, అత‌ని వ‌ల్లే ల‌క్ క‌లిసివ‌చ్చిందా?

గంభీర్ వెనక కోహ్లీ కుప్పిగంతులు..అస‌భ్యక‌రంగా చేతులు చూపిస్తూ డ్యాన్స్

లార్ట్స్ మైదానంలో ఈ గంట కొట్ట‌డానికి కార‌ణం ఏంటి? దీని వెనుక ఉన్న‌ర‌హ‌స్యం

రోహిత్ శ‌ర్మ‌, కోహ్లీ ఇద్ద‌రూ టీమిండియాకు హార్ట్ బీట్ లాంటోళ్లు..వాళ్ల‌ను ట‌చ్ చేయెద్దు

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 ఫైన‌ల్ మ్యాచ్ టైమింగ్స్ ఇవే..ఇండియాలో లైవ్ ఎప్పుడంటే ?

రెండు మ్యాచ్ ల‌కే గాయ‌ప‌డ్డ బుమ్రాతో వ‌ర‌ల్డ్ క‌ప్ గెలుస్తారా? గ‌వాస్క‌ర్ సీరియ‌స్‌

Big Stories

Advertisement
×