E-Paper
Advertisement

Road Accident: భోగి పండుగ వేళ మహబూబ్‌నగర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. డీసీఎంని ఢీ కొట్టిన ఆర్టీసీ

Road Accident: భోగి పండుగ వేళ మహబూబ్‌నగర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. డీసీఎంని ఢీ కొట్టిన ఆర్టీసీ

Road Accident: సంక్రాంతి పండుగ సందర్భంగా తమ సొంత ఊర్లకు వెళుతుండగా ఘోర ప్రమాదం చోటుచేసుకుంది.  హైదరాబాదు నుండి కర్నూలు వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సు ముందు వెళ్తున్న డీసీఎంని ఢీ కొట్టింది. ఈ ఘటనలో బస్సులోని ప్రయాణికులకు తీవ్రగాయాలు అయ్యాయి.

మహబూబ్‌నగర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

మహబూబ్‌నగర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జడ్చర్ల మండలం మాచారం 44 వ జాతీయ రహదారిపై మంగళవారం ప్రమాదం చోటు చేసుకుంది. అర్ధరాత్రి 1.30 గంటలకు హైదరాబాద్ నుండి కర్నూలు వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సు.. ముందు వెళ్తున్న డీసీఎం వాహనాన్ని వెనక నుంచి ఢీకొట్టింది.

ప్రమాదం సమయంలో బస్సులో ఉన్న 20 మంది ప్రయాణికులకు తీవ్ర గాయాల య్యాయి. ఘటన గురించి సమాచారం అందుకున్న వెంటనే 108 అంబులెన్స్‌ అక్కడికి చేరుకున్నాయి. క్షతగాత్రులను మహబూబ్‌నగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారు అక్కడ చికిత్స తీసుకుంటున్నారు.

డీసీఎంని ఢీ కొట్టిన ఆర్టీసీ బస్సు

ఈ ప్రమాదం నేపథ్యంలో కిలోమీటర్ల మేరవాహనాలు నిలిచిపోయాయి. సమచారం అందుకున్న వెంటనే పోలీసులు అక్కడికి చేరుకున్నారు. వాహనాలను పక్కకు తొలగించి ట్రాఫిక్ క్లియర్ చేశారు.  వాహనాలు ఘటన ప్రాంతంలో నెమ్మదిగా వెళ్తున్నాయి. మరోవైపు ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.  వాహనాల డ్రైవర్లతో మాట్లాడారు. అలాగే ప్రయాణికుల నుంచి వివరాలు తెలుసుకున్నారు.  ఈ ఘటన గురించి మరిన్ని వివరాలు తెలియాల్సివుంది. 

ALSO READ:  కూకట్ పల్లిలో భారీ అగ్నిప్రమాదం.. పేలిన గ్యాస్ సిలెండర్లు

 

Related News

ఆసుపత్రిలో అగ్నిప్రమాదం.. 10 మంది మృతి? మృతులు పెరిగే అవకాశం, పేషెంట్ల బంధువుల్లో టెన్షన్

అనంతపురంలో ఘరానా మోసం.. స్టాక్ మార్కెట్ పేరుతో రూ.25 కోట్లు స్కామ్!

ఢిల్లీ రెస్టారెంట్‌లో భారీ అగ్నిప్రమాదం.. 21 మంది మృతి

విశాఖలో ఘరానా మోసం.. క్రిప్టో కరెన్సీ పేరిట రూ.10 కోట్లు వసూలు!

దుర్గంచెరువు కేబుల్ బ్రిడ్జిపై ఘోరం.. యువతి ఆత్మహత్య!

‘కిల్లర్’ మూవీ సెట్లో విషాదం.. గ్యాస్ సిలిండర్ పేలి టెక్నీషియన్ మృతి

ఏపీలో వేర్వేరు ప్రాంతాల్లో ఘోర రోడ్డు ప్రమాదం.. విశాఖలో రెండు వాహనాలను ఢీ కొట్టిన బొలెరో వ్యాన్

Medchal Crime: అల్వాల్‌లో దొంగల బీభత్సం కలకలం.. 30 తులాల బంగారం చోరీ..!

Big Stories

×