E-Paper
Advertisement

Siddipet Crime: బతుకుదెరువు కోసం వస్తే.. మృత్యువు ఒడిలోకి.. ముగ్గురు వలస కూలీల మృతి

Siddipet Crime: బతుకుదెరువు కోసం వస్తే.. మృత్యువు ఒడిలోకి.. ముగ్గురు వలస కూలీల మృతి

Siddipet Crime:  సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలంలో తీరని విషాదం నెలకొంది. బతుకుదెరువు కోసం వేల కిలోమీటర్ల దూరం నుంచి వచ్చిన వలస కూలీలను మృత్యువు కబళించింది. కస్తూరిపల్లి గ్రామంలో ఉన్న చెక్ డ్యామ్‌లో పడి ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనతో స్థానికంగా విషాదఛాయలు అలుముకున్నాయి.

బీహార్ రాష్ట్రం నుంచి రెండు కుటుంబాలు ఐదు రోజుల క్రితమే ఉపాధి కోసం కస్తూరిపల్లికి వచ్చాయి. సాయంత్రం స్నానం చేసేందుకు 12 ఏళ్ల కిరణ్ కుమార్, 6 ఏళ్ల బిర్జు చెక్ డ్యామ్ వద్దకు వెళ్లారు. ప్రమాదవశాత్తు నీటి లోతు ఎక్కువగా ఉన్న చోట పడి ఇద్దరు గల్లంతయ్యారు. గమనించిన ఉమా దేవి .. ఆ చిన్నారులను కాపాడే క్రమంలో తాను కూడా నీటిలో దిగి గల్లంతయ్యింది.

స్థానికులు వెంటనే స్పందించి గాలింపు చేపట్టినప్పటికీ అప్పటికే ముగ్గురు మృతి చెందారు. మృతదేహాలను బయటకు తీసిన పోలీసులు పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించారు. ఐదు రోజుల కిందటే వచ్చిన వారు ఇలా విగతజీవులుగా మారడంతో వారి కుటుంబ సభ్యుల ఆర్తనాదాలు అక్కడి వారిని కలచివేస్తున్నాయి. మృతుల్లో ఉమా దేవి, ఆమె కుమారుడు కిరణ్ ఉండటంతో ఆ కుటుంబంలో తీరని శోకం మిగిలింది.

ALSO READ: Iran: అగ్నిగుండంలా ఇరాన్.. ఖమేనీ పని ఖతం.. !

Related News

అమీర్‌పేటలోని షాపింగ్ కాంప్లెక్స్‌లో అగ్ని ప్రమాదం.. ఎగసిపడుతున్న మంటలు!

కూకట్‌పల్లిలో దారుణం.. భార్యను చంపి పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయిన భర్త!

ఏపీలో దారుణం.. వీడియోలు తీస్తూ మ‌హిళ‌పై అత్యాచారం

అరుణాచలం గిరిప్రదక్షిణ దారిలో ఘోరం..ఇద్దరు యువతులపై గ్యాంగ్‌రే*ప్

గంజాయి డాన్‌గా మారిన సస్పెండెడ్ కానిస్టేబుల్.. రూ.79 లక్షల డ్రగ్స్ సీజ్!

ఆసుపత్రిలో అగ్నిప్రమాదం.. 10 మంది మృతి? మృతులు పెరిగే అవకాశం, పేషెంట్ల బంధువుల్లో టెన్షన్

అనంతపురంలో ఘరానా మోసం.. స్టాక్ మార్కెట్ పేరుతో రూ.25 కోట్లు స్కామ్!

ఢిల్లీ రెస్టారెంట్‌లో భారీ అగ్నిప్రమాదం.. 21 మంది మృతి

Big Stories

×