Jangaon: జనగామ జిల్లాలో కేవలం నాటుకోడి కూర వండాలనే చిన్న పట్టింపు, ఒక కుటుంబంలో తీరని విషాదాన్ని నింపింది. క్షణికావేశంలో కన్నతండ్రిపైనే రోకలిబండతో దాడి చేసి ప్రాణాలు తీశాడు ఓ కొడుకు. ఈ ఘోర కలి తరిగొప్పుల మండలం అక్కరాజుపల్లి గ్రామంలో వెలుగుచూసింది.
స్థానికులు వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన రమేష్ అనే వ్యక్తి ఇంటికి నాటుకోడి తెచ్చి, దానిని వండాలంటూ తన భార్య అనూషతో గొడవకు దిగాడు. అయితే, ఇంట్లో అప్పటికే ‘చేపల కూర’ ఉందని, ఇప్పుడు మళ్లీ కోడికూర ఎందుకని అనూష వారించింది. ఈ క్రమంలో భార్యాభర్తల మధ్య మాట మాట పెరిగింది. ఆగ్రహానికి లోనైన రమేష్.. భార్యను దుర్భాషలాడుతూ ఆమెపై చేయి చేసుకున్నాడు.
అదే సమయంలో అక్కడే ఉన్న వారి కుమారుడు గణేష్.. తన తల్లిని ఎందుకు కొడుతున్నావంటూ తండ్రి రమేష్ను నిలదీశాడు. దీంతో తండ్రీకొడుకుల మధ్య తీవ్ర ఘర్షణ చోటుచేసుకుంది. ఆ కోపంలో గణేష్ పక్కనే ఉన్న రోకలిబండను తీసుకుని తండ్రి తలపై బలంగా బాదాడు. ఈ దాడిలో రమేష్ తీవ్ర రక్తస్రావమై కిందపడిపోయాడు.
తీవ్ర గాయాలపాలైన రమేష్ను గమనించిన స్థానికులు వెంటనే ఆస్పత్రికి తరలించారు. అయితే, పరిస్థితి విషమించడంతో చికిత్స పొందుతూ రమేష్ కన్నుమూశాడు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు రంగంలోకి దిగారు. మృతుడి సోదరుడు శ్రీనివాస్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుడైన కుమారుడు గణేష్ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. చిన్న విషయానికే తండ్రి ప్రాణాలు పోవడం, కొడుకు జైలుపాలు కావడంతో గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి.
Also Read: ఫామ్హౌస్లో ‘పెద్ద శుక్రాచార్యుడు’.. ఫ్యూచర్ సిటీని రద్దు చేస్తే బండకేసి కొడతారు.. సీఎం రేవంత్
కోడి కూర వివాదం.. కొడుకు చేతిలో తండ్రి హతం
జనగామ జిల్లా అక్కరాజుపల్లిలో నాటుకోడి కూర వండలేదన్న వివాదం తండ్రి ప్రాణాలు తీసింది. రమేష్ కోడి తీసుకురాగా, భార్య అనూష నిరాకరించడంతో గొడవ మొదలైంది. దీన్ని అడ్డుకోబోయిన కుమారుడు గణేష్పై తండ్రి చేయిచేసుకోవడంతో, కోపంతో గణేష్ రోకలిబండతో… pic.twitter.com/eDSjCWDjfd
— ChotaNews App (@ChotaNewsApp) June 11, 2026