Insurance Scam: స్వేచ్ఛ బ్యూరో: జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో నకిలీ వాహన భీమా సర్టిఫికెట్లు తయారు చేస్తున్న ముఠాను SOT మేడ్చల్ బృందం బట్టబయలు చేసింది. ఎన్ఎల్బీ నగర్లో నిర్వహించిన దాడిలో మొత్తం 9 మందిని అరెస్టు చేసి 441 నకిలీ వాహన భీమా సర్టిఫికెట్లు స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న పాలసీలలో హెచ్డిఎఫ్సి – 56 రాయల్ సుందరం – 192, బజాజ్ అలియాంజ్ – 101, కోటక్ – 41,రిలయన్స్ – 51 ఉండగా, వీటి మొత్తం ప్రీమియం విలువ సుమారు రూ. 91,74,686గా పోలీసులు తెలిపారు.
SOT సూచనల మేరకు టి. గిరిధర్ గౌడ్ అనే ఏజెంట్ను అదుపులోకి తీసుకుని విచారించగా, రాగుల రవి, శివకుమార్, మాణిక్యాలరావు @ చంటి అనే ముగ్గురు ఎడిటర్లు నకిలీ భీమా సర్టిఫికెట్లు తయారు చేస్తున్నట్లు వెలుగులోకి వచ్చింది. వీరితో పాటు ఒక ఆర్టీఏ ఏజెంట్ బాబురావు, మరో ఐదుగురు ఏజెంట్లు కూడా ఈ ముఠాలో సభ్యులుగా ఉన్నట్లు తెలిసింది. పోలీసుల వివరాల ప్రకారం, కస్టమర్ల నుండి ఒక్కో పాలసీకి రూ. 2000 వసూలు చేసి, ఎడిటర్లకు రూ.800 నుండి 1000 వరకు చెల్లిస్తూ నకిలీ సర్టిఫికెట్లు తయారు చేయించేవారు.
Also Read: Taapsee Pannu: అప్పుడలా.. ఇప్పుడిలా.. తాప్సీ మాటలు నమ్మడం ఎలా?
ఏం ఎస్ ఆఫీస్ పరిజ్ఞానంతో QR కోడ్లతో కూడిన నకిలీ పాలసీలు రూపొందించి సాఫ్ట్ కాపీలను ఏజెంట్లకు పంపించేవారు. ఏజెంట్లు వాటిని ప్రింట్ తీసి కస్టమర్లకు అందజేసేవారు. గత నాలుగేళ్లుగా ఈ అక్రమ కార్యకలాపాలు సాగుతున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై జీడిమెట్ల పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Also Read: Honda Activa: అమ్మకాల్లో హోండా యాక్టివా నయా రికార్డు, ఒకే రాష్ట్రంలో 50 లక్షల యూనిట్లు సేల్!