E-Paper
Advertisement

Dog Attack: ఎనిమిది మందిపై కుక్క దాడి.. కొట్టి చంపిన గ్రామస్తులు

Dog Attack: ఎనిమిది మందిపై కుక్క దాడి.. కొట్టి చంపిన గ్రామస్తులు
Advertisement

Dog Attack: శ్రీసత్యసాయి జిల్లా మదూడి గ్రామంలో దారుణమైన ఘటన చోటుచేసుకుంది. కాలనీలో పెంచుతున్న ఓ పెంపుడు కుక్క ఆకస్మాత్తుగా రెచ్చిపోయి గ్రామంలోని పలువురిపై దాడి చేసింది. ఒక్కసారిగా  జరిగిన ఈ ఘటనతో గ్రామస్తులు భయాందోళన చెందారు. ఈ దాడిలో ఏకంగా ఎనిమిది మంది గ్రామస్తులు ఉండగా.. వారిలో చిన్న పిల్లలు కూడా ఉండడం పరిస్థితి మరింత తీవ్రంగా మారింది.

కుక్క దాడి కారణంగా గాయపడిన వారిలో కొందరికి తీవ్ర గాయాలు కావడంతో వెంటనే వారిని సమీప ఆసుపత్రికి తరలించారు. పిల్లలు గాయపడటంతో గ్రామస్తుల్లో ఆందోళనతో పాటు ఆగ్రహం కూడా చెలరేగింది. పెంపుడు జంతువును సరిగా నియంత్రించడంలో యజమాని నిర్లక్ష్యం వహించాడన్న భావన గ్రామంలో బలంగా వ్యక్తమైంది.

Advertisement

దీంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన గ్రామస్తులు ఆ కుక్కను కొట్ట చంపేశారు. అడ్డొచ్చిన కుక్క యజమానిపై కూడా గ్రామస్తులు  తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామస్తులు కోపాన్ని, ఆవేశాన్ని చూసి యాజమాని కూడా ఏమీ మాట్లాడలేని పరిస్థితిలో సైలెంట్ అయిపోయాడు.

Related News

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

Big Stories

Advertisement
×