E-Paper
Advertisement

Srikakulam Road Accident: బైకర్‌ను తప్పించబోయి.. కారును ఢీకొట్టిన లారీ.. ముగ్గురు మృతి

Srikakulam Road Accident: బైకర్‌ను తప్పించబోయి.. కారును ఢీకొట్టిన లారీ.. ముగ్గురు మృతి
Advertisement

Srikakulam Road Accident: నేడు రోడ్డుపై అడుగు పెట్టడమంటే ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని ప్రయాణించడమే. నిన్నటి వరకు పలకరించిన మనుషులు..  నేడు రోడ్డు ప్రమాదాల రూపంలో నిర్జీవంగా మారుతుండటం అత్యంత విషాదకరం. ఉదయం ఇంటి నుండి బయలుదేరిన వ్యక్తి..  సాయంత్రానికి క్షేమంగా తిరిగి వస్తాడన్న నమ్మకం లేకుండా పోతుంది. అలాంటి ఘటనే ఇప్పుడు శ్రీకాకుళం జిల్లాలో చోటుచేసుకుంది. కేవలం ఒక బైకర్ నిర్లక్ష్యం కారణంగా ముగ్గురు ప్రాణాలు గాలులో కలిసిపోయాయి. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

శ్రీకాకుళం జిల్లాలో మరోసారి ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. రణస్థలం మండలం బారువ జంక్షన్ వద్ద జరిగిన ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ప్రమాదానికి సంబంధించిన సీసీ ఫుటేజ్ బయటకు రావడంతో సంఘటన తీవ్రత స్పష్టంగా కనిపిస్తోంది.

Advertisement

బారువ జంక్షన్ వద్ద ఓ బైకర్ నిర్లక్ష్యంగా రోడ్డు క్రాస్ చేయడానికి ప్రయత్నించాడు. అదే సమయంలో ఆ మార్గంలో వేగంగా వస్తున్న లారీ..  బైకర్‌ను ఢీకొట్టకుండా తప్పించేందుకు ప్రయత్నించింది. ఈ క్రమంలో లారీ డ్రైవర్ వాహనంపై నియంత్రణ కోల్పోయాడు. ఫలితంగా లారీ డివైడర్‌ను దాటి అవతలి వైపుకు దూసుకెళ్లి ఎదురుగా వస్తున్న కారును బలంగా ఢీకొట్టింది.

లారీ ఢీకొట్టిన ప్రభావంతో కారు పూర్తిగా ధ్వంసమైంది. కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు తీవ్ర గాయాలతో .. అక్కడికక్కడే మృతి చెందారు. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు సంఘటనా స్థలానికి చేరుకుని పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు, అంబులెన్స్ సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాలను బయటకు తీసి పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

Advertisement

సీసీ ఫుటేజ్ ఆధారంగా పరిశీలిస్తే..  బైకర్ నిర్లక్ష్యంగా రోడ్డు దాటడమే ఈ ఘోర ప్రమాదానికి ప్రధాన కారణమని పోలీసులు భావిస్తున్నారు. రోడ్డు నిబంధనలను పాటించకపోవడం వల్లే అమాయకుల ప్రాణాలు పోయాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బారువ జంక్షన్ వద్ద ట్రాఫిక్ రద్దీ ఎక్కువగా ఉండటంతో పాటు..  వాహనాల వేగ నియంత్రణకు తగిన చర్యలు తీసుకోవడం లేదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. రోడ్డు భద్రతపై ప్రజలు మరింత అవగాహన కలిగి ఉండాలని, ముఖ్యంగా రోడ్డు దాటే సమయంలో జాగ్రత్తలు పాటించాలని అధికారులు సూచిస్తున్నారు.

ALSO READ:  ఏపీలో కోర్టులకు బాంబు బెదిరింపులు.. రాష్ట్రవ్యాప్తంగా హై అలర్ట్!

Related News

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

Big Stories

Advertisement
×