Srikakulam: శ్రీకాకుళం జిల్లా పలాస సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. నెమలి నారాయణపురం వద్ద జాతీయ రహదారిపై వేగంగా వెళ్తున్న ఒక ఇన్నోవా కారు ఒక్కసారిగా అదుపుతప్పి పల్టీలు కొట్టింది. ఒడిశాలోని పర్లాఖిమిండికి చెందిన ఒకే కుటుంబ సభ్యులు జగన్నాథుడి దర్శనం కోసం పూరీ వెళ్లారు. అక్కడ పూజా కార్యక్రమాలు ముగించుకుని తిరిగి ఇంటికి వస్తుండగా ఈ విషాదం చోటుచేసుకుంది.
ప్రమాద సమయంలో ఒక్కసారిగా వీచిన ఈదురుగాలుల ప్రభావంతో కారు డ్రైవర్ నియంత్రణ కోల్పోయినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో కారు అదుపుతప్పి డివైడర్ను బలంగా ఢీకొట్టింది. అంతటితో ఆగకుండా గాలిలో పల్టీలు కొడుతూ అవతలి వైపు రోడ్డుపై వస్తున్న లారీని ఢీకొట్టింది. ఆ వేగానికి కారు రోడ్డు పక్కన ఉన్న పొలాల్లోకి దూసుకెళ్లి తునాతునకలైంది. ఈ భీకర దృశ్యాలన్నీ సమీపంలోని సీసీ టీవీ కెమెరాల్లో రికార్డయ్యాయి.
ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. వీరిలో ఇద్దరి పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. క్షతగాత్రులను వెంటనే పలాస ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి అత్యవసర చికిత్స అందిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు. ఈ ఘటనకు సంబంధించిన సీసీ ఫుటేజ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Also Read: కడపలో విషాదం.. షార్ట్ ఫిలిం తీసేందుకు వెళ్లి ముగ్గురు యువకులు మృతి
పల్టీ కొట్టిన ఇన్నోవా కారు.. సీసీ ఫుటేజ్
శ్రీకాకుళం జిల్లా పలాసలో ఘోర రోడ్డు ప్రమాదం
నెమలి నారాయణపురం నేషనల్ హైవేపై పల్టీ కొట్టిన ఇన్నోవా కారు
ముగ్గురికి తీవ్ర గాయాలు.. ఇద్దరి పరిస్థితి విషమం
ఈదురుగాలులకు ఒక్కసారిగా అదుపుతప్పిన కారు
డివైడర్ ను ఢీకొని, అవతలి రోడ్డులో… pic.twitter.com/WYoT8rr6RM
— BIG TV Breaking News (@bigtvtelugu) April 6, 2026