Hyderabad: నేటి ఆధునిక సమాజంలో మానవ సంబంధాలు అత్యంత వేగంగా దిగజారిపోతున్నాయి. ఒకప్పుడు నూరేళ్ల పంటగా భావించే వివాహ బంధం.. నేడు క్షణికమైన శారీరక వాంఛల కోసం, కొత్త దనం కోరుకునే మోజు కోసం బలి అయిపోతోంది. ప్రేమించి పెళ్లి చేసుకున్న వారైనా, పెద్దలు కుదిర్చిన సంబంధమైనా… కొన్నాళ్లకే ఒకరిపై ఒకరికి విరక్తి కలగడం లేదా మూడో వ్యక్తి ప్రవేశంతో పచ్చని సంసారంలో చిచ్చు మొదలవుతోంది. అలాంటి ఘటనే ఇప్పుడు హైదరాబాద్ నగరంలోని చైతన్యపురి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.
హైదరాబాద్కు చెందని బాబు అనే వ్యక్తి లక్డీకాపూల్లోని ఇంటెలిజెన్స్ విభాగంలో అటెండర్గా విధులు నిర్వహిస్తున్నాడు. ఇతనికి 2010లో జ్యోతి అనే మహిళతో పరిచయం ఏర్పడింది.. అది కాస్తా ప్రేమగా మరడంతో పెద్దలను ఒప్పించి వివాహా చేసుకున్నారు. పెళ్లయన కొత్తలో వీరి సంసారం సాఫిగానే సాగింది. వీరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. అయితే.. కొన్నాళ్ల తర్వాత బాబు ప్రవర్తనలో మార్పు వచ్చింది. భార్య జ్యోతిని మానసికంగా, శారీరకగా వేధించడం ప్రారంభించాడని భార్య ఆరోపించింది.
భర్త తనపై చూపుతున్న నిర్లక్ష్యానికి కారణం మరో మహిళ అని జ్యోతికి అనుమానం కలిగింది. దీంతో బాాబు పద్దతి మార్చుకోవాలని చాలాసార్లు చెప్పి చూసింది. అలా చెప్పిన ప్రతీసారి వేధింపులు మరింత ఎక్కువయ్యాయి. ఈ క్రమంలోనే బాబు చైతన్యపురి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఒక ఇంట్లో మరో మహిళతో కలిసి సహజీవనం చేస్తున్నట్లు జ్యోతికి పక్కా సమాచారం అందింది. దీంతో ఈ విషయాన్ని వెంటనే జ్యోతి తన బంధువులతో కలిసి సదరు ఇంటిపై దాడి చేసింది. అక్కడ తన భర్త బాబు మరో మహిళతో కలిసి ఉండడాన్ని చూసి షాక్ అయ్యింది. ఆవేశం హద్దులు దాటడంతో జ్యోతి, ఆమె బంధువులు బాబుకు దేహశుద్ధి చేశారు. నిలదీసిన క్రమంలో అక్కడ కొంతసేపు ఉద్రిక్తత చోటుచేసుకుంది.
ఇది గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో రంగంలోకి దిగిని పోలీసులు పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. బాధితురాలు జ్యోతి ఫిర్యాదుతో నిందితుడు బాబును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తనను మోసం చేసి మరో మహిళతో ఉంటున్న భర్తపై కఠిన చర్యలు తీసుకోవాలని జ్యోతి పోలీసులను కోరింది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.
ALSO READ: Machilipatnam: వీరంగం సృష్టిస్తే వీపు విమానం మోత తప్పదు.. బందరు పోలీసుల వినూత్న శిక్ష!