E-Paper
Advertisement

Student Suicide: గురుకుల పాఠశాలలో పదో తరగతి విద్యార్థిని ఆత్మహత్య

Student Suicide: గురుకుల పాఠశాలలో పదో తరగతి విద్యార్థిని ఆత్మహత్య

Student Suicide: హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి గురుకుల పాఠశాలలో.. విద్యార్ధినీ ఆత్మహత్య కలకలం రేపుతోంది. 10వ తరగతికి చెందిన శ్రీవర్షిని(15) అనే విద్యార్థిని హాస్టల్ డార్మెటరీ గదిలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.

వివరాల్లోకి వెళ్తే.. హుజరాబాద్ మండలం రాంపూర్ గ్రామానికి చెందిన వర్షిని.. బీమదేవరపల్లి మండలం గురుకుల పాఠశాలలో 10 వ తరగతి చదువుతుంది. ఇటీవల దీపావళి సందర్భంగా గురుకులానికి సెలవులు ఇవ్వడంతో.. వర్షిణి తన స్వగ్రామానికి వెళ్లింది. నిన్న సాయంత్రం తిరిగి హాస్టల్‌కి చేరింది. శుక్రవారం తెల్లవారుజామున డార్మెటరీ గదిలో సూసైడ్ చేసుకుంది. వెంటనే హాస్టల్ సిబ్బంది పోలీసులకు సమాచారం ఇవ్వడంతో.. ఘటనా స్థలానికి చేరుకుని.. మృత దాహాన్ని స్వాధీనం చేసుకున్నారు.

Also Read: మృతుల కుటుంబాలకు రూ.5 లక్షలు ఎక్స్ గ్రేషియా.. తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం

ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా తెలియరాలేదు. అయితే వర్షిని ఆత్మహత్యకు ముందు ఎటువంటి సుసైడ్ నోట్ రాయలేదు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపడుతున్నారు. తమ కూతురు మృతి చెందడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. వర్షిని మృతికి ప్రేమ వ్యవహారమా.. లేక చదువులో ఒత్తిడి కారణంగా ఆత్మహత్య చేసుకుందా లేదా ఎవరైనా వేధింపులకు గురి చేశారా అన్నకోణంలో పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

 

Related News

అరుణాచలం గిరిప్రదక్షిణ దారిలో ఘోరం..ఇద్దరు యువతులపై గ్యాంగ్‌రే*ప్

గంజాయి డాన్‌గా మారిన సస్పెండెడ్ కానిస్టేబుల్.. రూ.79 లక్షల డ్రగ్స్ సీజ్!

ఆసుపత్రిలో అగ్నిప్రమాదం.. 10 మంది మృతి? మృతులు పెరిగే అవకాశం, పేషెంట్ల బంధువుల్లో టెన్షన్

అనంతపురంలో ఘరానా మోసం.. స్టాక్ మార్కెట్ పేరుతో రూ.25 కోట్లు స్కామ్!

ఢిల్లీ రెస్టారెంట్‌లో భారీ అగ్నిప్రమాదం.. 21 మంది మృతి

విశాఖలో ఘరానా మోసం.. క్రిప్టో కరెన్సీ పేరిట రూ.10 కోట్లు వసూలు!

దుర్గంచెరువు కేబుల్ బ్రిడ్జిపై ఘోరం.. యువతి ఆత్మహత్య!

‘కిల్లర్’ మూవీ సెట్లో విషాదం.. గ్యాస్ సిలిండర్ పేలి టెక్నీషియన్ మృతి

Big Stories

×