BigTV English
Advertisement

Student Suicide: గురుకుల పాఠశాలలో పదో తరగతి విద్యార్థిని ఆత్మహత్య

Student Suicide: గురుకుల పాఠశాలలో పదో తరగతి విద్యార్థిని ఆత్మహత్య

Student Suicide: హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి గురుకుల పాఠశాలలో.. విద్యార్ధినీ ఆత్మహత్య కలకలం రేపుతోంది. 10వ తరగతికి చెందిన శ్రీవర్షిని(15) అనే విద్యార్థిని హాస్టల్ డార్మెటరీ గదిలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.


వివరాల్లోకి వెళ్తే.. హుజరాబాద్ మండలం రాంపూర్ గ్రామానికి చెందిన వర్షిని.. బీమదేవరపల్లి మండలం గురుకుల పాఠశాలలో 10 వ తరగతి చదువుతుంది. ఇటీవల దీపావళి సందర్భంగా గురుకులానికి సెలవులు ఇవ్వడంతో.. వర్షిణి తన స్వగ్రామానికి వెళ్లింది. నిన్న సాయంత్రం తిరిగి హాస్టల్‌కి చేరింది. శుక్రవారం తెల్లవారుజామున డార్మెటరీ గదిలో సూసైడ్ చేసుకుంది. వెంటనే హాస్టల్ సిబ్బంది పోలీసులకు సమాచారం ఇవ్వడంతో.. ఘటనా స్థలానికి చేరుకుని.. మృత దాహాన్ని స్వాధీనం చేసుకున్నారు.

Also Read: మృతుల కుటుంబాలకు రూ.5 లక్షలు ఎక్స్ గ్రేషియా.. తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం


ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా తెలియరాలేదు. అయితే వర్షిని ఆత్మహత్యకు ముందు ఎటువంటి సుసైడ్ నోట్ రాయలేదు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపడుతున్నారు. తమ కూతురు మృతి చెందడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. వర్షిని మృతికి ప్రేమ వ్యవహారమా.. లేక చదువులో ఒత్తిడి కారణంగా ఆత్మహత్య చేసుకుందా లేదా ఎవరైనా వేధింపులకు గురి చేశారా అన్నకోణంలో పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

 

Related News

Tirupati Tragedy: ఏపీలో మరో విషాదం.. స్వర్ణముఖి నదిలో నలుగురు గల్లంతు

Delhi ISIS Attack Foiled: దీపావళి నాడు భారీ ఉగ్రదాడికి కుట్ర.. భగ్నం చేసిన దిల్లీ పోలీసులు.. ఇద్దరు ఐసిస్ మద్దతుదారులు అరెస్ట్

Kurnool Bus Accident: బస్సును తొలగిస్తుండగా మరో ప్రమాదం.. క్రేన్ బోల్తా

Crime News: బలవంతంగా నాలుగు సార్లు రేప్ చేసిన ఎస్ఐ.. సూసైడ్ నోట్ రాసి మహిళా డాక్టర్ ఆత్మహత్య

Kurnool Bus Fire Accident: కర్నూలు బస్సు ప్రమాదం.. గాయపడిన, సురక్షితంగా ఉన్న ప్రయాణికులు వీళ్లే

Kurnool Bus Accident: కర్నూలు బస్సు దగ్ధం ఘటన.. 16 బృందాలతో దర్యాప్తు.. రూ.5 లక్షలు ఎక్స్ గ్రేషియా ప్రకటన

Pune Crime: భార్యపై అనుమానం పెనుభూతం.. చివరకు భర్త గొంతు కోసింది, ఆ తర్వాత

Big Stories

×