E-Paper
Advertisement

Topudurthi Mahesh Reddy: అనంతలో యువకుడి హత్య! రాజకీయ రంగు, మిడ్ నైట్ ఏం జరిగింది?

Topudurthi Mahesh Reddy: అనంతలో యువకుడి హత్య! రాజకీయ రంగు, మిడ్ నైట్ ఏం జరిగింది?
Advertisement

Topudurthi Mahesh Reddy: అనంతపురంలో మళ్లీ ఫ్యాక్షన్ రాజకీయాలు మొదలయ్యాయా? ఓ హత్య చుట్టూ రాజకీయ రంగు పులుముకుంటుందా? ఇటీవల పరిటాల శ్రీరామ్‌ని మృతుడు ఎందుకు కలిశాడు? దర్యాప్తులో కీలక విషయాలు బయటకు వస్తాయా? ఇవే ప్రశ్నలు అక్కడికి వారిని వెంటాడుతున్నాయి.

అనంతపురంలో ఓ యువకుడు అనుమానాస్పద మృతి చెందాడు. మృతుడు పేరు తోపుదుర్తి మహేష్‌రెడ్డి. నగర సమీపంలో రైల్వే పట్టాలపై అనుమానాస్పదంగా మృతి చెందాడు. రాత్రి స్నేహితుడితో కలిసి బయటకు వెళ్లాడు. ఆ తర్వాత స్నేహితుడ్ని టూ వీలర్‌లో పంపేశాడు. తెల్లారేసరికి రైలు పట్టాలపై శవమైన కనిపించాడు మహేష్. ఈ ఘటన సోమలదొడ్డి-నాగిరెడ్డిపల్లి గ్రామాల మధ్య జరిగినట్టు తెలుస్తోంది.

Advertisement

మృతుడు గతంలో వైసీపీ హయాంలో బైరెడ్డి సిద్ధార్థ టీమ్‌లో పని చేశాడు. కొన్ని రోజులుగా మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి సోదరులకు వ్యతిరేకంగా పని చేశాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలీదు. కొద్దిరోజుల కిందట పరిటాల శ్రీరామ్‌ని కలిశాడు తోపుదుర్తి మహేష్.

ఇంతలోనే ఈ దారుణం జరిగింది. ఈ ఘటనపై పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. మృతుడికి చెందిన తోపుదుర్తి మహేష్‌రెడ్డి సోషల్ మీడియా పోస్టులపై ఆరా తీస్తున్నారు. మహేష్ గురించి తెలిసిన వారిపై పోలీసులు ఓ కన్నేశారు. మరి పోలీసుల విచారణలో ఇంకెన్ని విషయాలు వెలుగులోకి వస్తాయో చూడాలి.

Advertisement

ALSO READ: వయాగ్రా టాబ్లెట్స్ వేసుకొని భర్త అనుమాస్పద మృతి.. భార్య ఎంత పని చేసిందంటే!

Related News

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

Big Stories

Advertisement
×