Topudurthi Mahesh Reddy: అనంతపురంలో మళ్లీ ఫ్యాక్షన్ రాజకీయాలు మొదలయ్యాయా? ఓ హత్య చుట్టూ రాజకీయ రంగు పులుముకుంటుందా? ఇటీవల పరిటాల శ్రీరామ్ని మృతుడు ఎందుకు కలిశాడు? దర్యాప్తులో కీలక విషయాలు బయటకు వస్తాయా? ఇవే ప్రశ్నలు అక్కడికి వారిని వెంటాడుతున్నాయి.
అనంతపురంలో ఓ యువకుడు అనుమానాస్పద మృతి చెందాడు. మృతుడు పేరు తోపుదుర్తి మహేష్రెడ్డి. నగర సమీపంలో రైల్వే పట్టాలపై అనుమానాస్పదంగా మృతి చెందాడు. రాత్రి స్నేహితుడితో కలిసి బయటకు వెళ్లాడు. ఆ తర్వాత స్నేహితుడ్ని టూ వీలర్లో పంపేశాడు. తెల్లారేసరికి రైలు పట్టాలపై శవమైన కనిపించాడు మహేష్. ఈ ఘటన సోమలదొడ్డి-నాగిరెడ్డిపల్లి గ్రామాల మధ్య జరిగినట్టు తెలుస్తోంది.
మృతుడు గతంలో వైసీపీ హయాంలో బైరెడ్డి సిద్ధార్థ టీమ్లో పని చేశాడు. కొన్ని రోజులుగా మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్రెడ్డి సోదరులకు వ్యతిరేకంగా పని చేశాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలీదు. కొద్దిరోజుల కిందట పరిటాల శ్రీరామ్ని కలిశాడు తోపుదుర్తి మహేష్.
ఇంతలోనే ఈ దారుణం జరిగింది. ఈ ఘటనపై పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. మృతుడికి చెందిన తోపుదుర్తి మహేష్రెడ్డి సోషల్ మీడియా పోస్టులపై ఆరా తీస్తున్నారు. మహేష్ గురించి తెలిసిన వారిపై పోలీసులు ఓ కన్నేశారు. మరి పోలీసుల విచారణలో ఇంకెన్ని విషయాలు వెలుగులోకి వస్తాయో చూడాలి.
ALSO READ: వయాగ్రా టాబ్లెట్స్ వేసుకొని భర్త అనుమాస్పద మృతి.. భార్య ఎంత పని చేసిందంటే!