Tamilnadu Accident: తమిళనాడు రాష్ట్రంలో పెను విషాదం చోటుచేసుకుంది. పొల్లాచ్చి సమీపంలోని వార్పేడే (Valparai) ఘాట్ రోడ్డులో ప్రయాణిస్తున్న ఒక వ్యాన్ అదుపు తప్పి లోయలో పడిపోవడంతో 10 మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదం జరిగిన సమయంలో వ్యాన్ లో మొత్తం 16 మంది ఉన్నట్లు సమాచారం.
కేరళలోని కోజికోడ్ నుంచి తమిళనాడులోని పొల్లాచ్చి వైపు వెళ్తుండగా ఈ ఘోరం జరిగింది. వాల్పారై ఘాట్ రోడ్డులోని అత్యంత ప్రమాదకరమైన 12వ హెయిర్పిన్ బెండ్ (మలుపు) వద్ద డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో వ్యాన్ వేగంగా లోయలోకి దూసుకెళ్లింది. మృతులంతా కేరళ వాసులుగా గుర్తించారు. మిగిలిన ఆరుగురికి తీవ్ర గాయాలు కావడంతో వారిని చికిత్స నిమిత్తం సమీప ఆసుపత్రికి తరలించారు.
వాల్పారై ఘాట్ రోడ్డులో మలుపులు చాలా లోతుగా ఉండటం, పైగా వాతావరణం అనుకూలించకపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగి ఉండవచ్చని ప్రాథమికంగా భావిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Read Also: ఇరాన్ కీలక నిర్ణయం.. హర్మోజ్ జలసంధి ఓపెన్.. ఊపిరి పీల్చుకున్న ప్రపంచ దేశాలు!