E-Paper

Road Accident: మురహరిపల్లిలో ఘోర ప్రమాదం.. ఒకే కుటుంబంలో ముగ్గురి మృతి!

Road Accident: మురహరిపల్లిలో ఘోర ప్రమాదం.. ఒకే కుటుంబంలో ముగ్గురి మృతి!
Advertisement

Road Accident: స్వేచ్చ బ్యూరో: మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మురహరిపల్లి సమీపంలో బుధవారం అర్ధరాత్రి జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందగా, బాలుడు తీవ్ర గాయాలతో చికిత్స పొందుతున్నాడు. హైదరాబాద్ వైపు వెళ్తున్న బ్రెజ్జా కారు (TS08JL8300), కరీంనగర్ వైపు వెళ్తున్న లారీ (TG05T9635) ఎదురెదురుగా ఢీకొనడంతో ఈ ప్రమాదం సంభవించింది.

Also read: Podarillu Today Episode : మహా కోసం చక్రీ గిఫ్ట్.. దిమ్మతిరిగే ట్విస్ట్ ఇచ్చిన మహా.. హమ్మయ్య.. చక్రీ కోరిక తీరిందా..?

ఒకే కుటుంబానికి చెందిన..

Advertisement

ప్రమాదంలో బ్రెజ్జా కారును నడుపుతున్న చంద్రశేఖర్ అక్కడికక్కడే మృతి చెందాడు. తీవ్రంగా గాయపడిన ఆయన భార్య రేఖ, కుమారుడు లోహిత్ (7), రేఖ సోదరి కుమారుడు నిహాల్ (2)లను స్థానికులు వెంటనే ఆర్వీఎం ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ రేఖ, నిహాల్ మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఎముకలకు తీవ్ర గాయాలైన లోహిత్‌కు చికిత్స కొనసాగుతోంది. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందడంతో విషాదఛాయలు అలుముకున్నాయి. ఘటనపై మేడ్చల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు.

Also read: Private School: ప్రభుత్వ నిభందనలకు తూట్లు.. అనుమతులు లేకుండానే పాఠశాల నిర్వహణ..!

Related News

హైవేపై కూలిన విమానం.. టెక్ స్టార్టప్ సీఈఓ మృతి, ధ్వంసమైన పలు వాహనాలు

Bengaluru Crime: సహజీవనంలో క్రైమ్ సీన్.. రొమాంటిక్ థ్రిల్లర్‌ మాదిరిగా, ప్రియురాల్ని ఏం చేశాడంటే

Osmania Medical College: ఉస్మానియా మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ కలకలం.. 12 మందిపై పోలీస్ కేసు!

సినిమా అవకాశం పేరుతో మోసం.. బంజారాహిల్స్ పీఎస్ లో యువ నటి ఫిర్యాదు!

మీర్‌పేట్‌లో లారీ భీభత్సం.. ఇద్దరు ఆటో డ్రైవర్లు మృతి!

సోలాపూర్‌లో ఘోర ప్రమాదం.. బావిలోకి దూసుకెళ్లిన వ్యాన్.. 8 మంది మృతి!

నలుగురిపైకి దూసుకెళ్లిన రైలు.. గాల్లోకి ఎగిరిపడి అక్కడికక్కడే మృతి!

×