E-Paper
Advertisement

Vishal Brahma Arrest: డ్రగ్స్ స్మగ్లింగ్ చేస్తూ పట్టుబడ్డ హీరో.. రూ.40 కోట్ల మత్తు పదార్థాలు స్వాధీనం

Vishal Brahma Arrest: డ్రగ్స్ స్మగ్లింగ్ చేస్తూ పట్టుబడ్డ హీరో.. రూ.40 కోట్ల మత్తు పదార్థాలు స్వాధీనం

Vishal Brahma Arrest: ప్రముఖ నిర్మాత కరణ్ జోహార్ 2019లో నిర్మించిన ‘స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్-2’లో సామ్రాట్ పాత్రలో నటించిన బాలీవుడ్ హీరో విశాల్ బ్రహ్మ డ్రగ్స్ కేసులో అరెస్టు అయ్యారు. చెన్నై ఎయిర్ పోర్టు రూ.40 కోట్ల విలువైన డ్రగ్స్ తో విశాల్ బ్రహ్మ డీఆర్ఐ అధికారులకు పట్టుబడ్డారు. అస్సాంకు చెందిన విశాల్ బ్రహ్మ ఎయిర్ ఇండియా విమానంలో సింగపూర్ నుంచి చెన్నైకి తిరిగి వస్తుండగా అధికారులు అతడ్ని తనిఖీ చేయగా డ్రగ్స్ పట్టుబడ్డాయి. ఈ డ్రగ్స్ సిండికేట్ వెనుక నైజీరియన్ ముఠా ఉన్నట్లు డీఆర్ఐ వర్గాలు వెల్లడించాయి.

విశాల్‌ బ్రహ్మకు ఇటీవల సినీ అవకాశాలు తగ్గడంతో ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటున్నాడని, స్నేహితుల ద్వారా నైజీరియా డ్రగ్స్ ముఠా పరిచయమైందని సమాచారం. ఆ ముఠా బ్రహ్మను కాంబోడియా ట్రిప్‌కు తీసుకెళ్లి, భారత్‌కు డ్రగ్స్ స్మగ్లింగ్ చేస్తే కొంత డబ్బు ఇస్తామని ఆశ చూపినట్టు తెలుస్తోంది. రెండు వారాల క్రితం విశాల్‌ బ్రహ్మ దిల్లీ నుంచి కాంబోడియా వెళ్లారు.

నైజీరియన్ ఇచ్చిన ట్రాలీలో డ్రగ్స్

విశాల్ ఇండియాకు తిరిగి వచ్చేటప్పుడు ఓ నైజీరియన్‌ ట్రాలీ బ్యాగ్‌ ఇవ్వగా అందులో భారీగా డ్రగ్స్‌ ఉన్నట్టు సమాచారం. కాంబోడియా నుంచి సింగపూర్‌ మీదుగా చెన్నై ఎయిర్ పోర్టుకు అక్కడి నుంచి దిల్లీకి రైలులో చేరుకోవాలని నైజీరియా గ్యాంగ్ బ్రహ్మకు సూచించినట్టు డీఆర్ఐ గుర్తించింది.

Also Read: Tandoor Crime: రైలు ఎక్కుతూ జారిపడి ASI మృతి.. వికారాబాద్ జిల్లాలో ఘటన

స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2 కీలక పాత్ర

పునీత్ మల్హోత్రా దర్శకత్వం వహించిన బాలీవుడ్ సినిమా ‘స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2’లో సామ్రాట్ అనే సహాయ పాత్ర పోషించిన విశాల్ బ్రహ్మ బాగా పేరు వచ్చింది. ఈ చిత్రంలో టైగర్ ష్రాఫ్, తారా సుతారియా, అనన్య పాండే నటించారు. ‘స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్’ ట్రోఫీ కోసం కళాశాల విద్యార్థుల మధ్య పోటీ, వారి మధ్య స్నేహాలు, ప్రేమ సంబంధాలను చక్కగా చిత్రీకరించారు.

Related News

గంజాయి డాన్‌గా మారిన సస్పెండెడ్ కానిస్టేబుల్.. రూ.79 లక్షల డ్రగ్స్ సీజ్!

ఆసుపత్రిలో అగ్నిప్రమాదం.. 10 మంది మృతి? మృతులు పెరిగే అవకాశం, పేషెంట్ల బంధువుల్లో టెన్షన్

అనంతపురంలో ఘరానా మోసం.. స్టాక్ మార్కెట్ పేరుతో రూ.25 కోట్లు స్కామ్!

ఢిల్లీ రెస్టారెంట్‌లో భారీ అగ్నిప్రమాదం.. 21 మంది మృతి

విశాఖలో ఘరానా మోసం.. క్రిప్టో కరెన్సీ పేరిట రూ.10 కోట్లు వసూలు!

దుర్గంచెరువు కేబుల్ బ్రిడ్జిపై ఘోరం.. యువతి ఆత్మహత్య!

‘కిల్లర్’ మూవీ సెట్లో విషాదం.. గ్యాస్ సిలిండర్ పేలి టెక్నీషియన్ మృతి

ఏపీలో వేర్వేరు ప్రాంతాల్లో ఘోర రోడ్డు ప్రమాదం.. విశాఖలో రెండు వాహనాలను ఢీ కొట్టిన బొలెరో వ్యాన్

Big Stories

×