Bus Fire: తిరుపతి జిల్లా తడ సమీపంలో భారీ ప్రమాదం తప్పింది. శ్రీసిటీలోని ప్రైవేట్ కంపెనీ ఉద్యోగులతో వెళ్తున్న ఓ బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. అదృష్టవశాత్తూ డ్రైవర్, సిబ్బంది అప్రమత్తంగా వ్యవహరించడంతో పెద్ద ప్రాణనష్టం తప్పింది.
స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. శ్రీసిటీలోని ‘IMOP’ కంపెనీకి చెందిన ఉద్యోగులు తమ విధి నిర్వహణ ముగించుకుని ప్రైవేటు బస్సులో సూళ్లూరుపేటకు బయలుదేరారు. బస్సు తడ సమీపంలోకి రాగానే ఇంజిన్ భాగం నుండి అకస్మాత్తుగా పొగలు, మంటలు వ్యాపించాయి. దీన్ని గమనించిన డ్రైవర్ వెంటనే వాహనాన్ని రోడ్డు పక్కన నిలిపివేసి, లోపల ఉన్న ఉద్యోగులను అప్రమత్తం చేశారు.
సమయస్ఫూర్తితో వ్యవహరించిన ఉద్యోగులంతా ఒకరినొకరు సాయం చేసుకుంటూ క్షణాల వ్యవధిలో బస్సు నుంచి కిందకు దిగిపోయారు. వారు దిగిన కొద్దిసేపటికే మంటలు బస్సు మొత్తానికి వ్యాపించి అగ్నిగోళంలా మారింది. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది వెంటనే ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపు చేశారు. ప్రమాద సమయంలో బస్సులో ఉన్నవారెవరికీ ఎలాంటి గాయాలు కాకపోవడంతో అటు కంపెనీ యాజమాన్యం, ఇటు కార్మిక కుటుంబాలు ఊపిరి పీల్చుకున్నాయి. షార్ట్ సర్క్యూట్ వల్లే ప్రమాదం జరిగి ఉండొచ్చని భావిస్తున్నారు.
Also Read: కారుపై పడిన కొమ్మలు తీస్తూ.. కరెంట్ షాక్తో తండ్రి, కూతురు దుర్మరణం!
ప్రైవేటు బస్సులో మంటలు
AP: తిరుపతి జిల్లా తడ సమీపంలో శ్రీసిటీకి చెందిన IMOP కంపెనీ ఉద్యోగులతో వెళ్తున్న ప్రైవేటు బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగి ప్రమాదం సంభవించింది. విధి నిర్వహణ ముగించుకుని సూళ్లూరుపేటకు సిబ్బందిని తీసుకెళ్తున్న క్రమంలో ఈ ఘటన జరిగింది. అయితే, డ్రైవర్,… pic.twitter.com/5JqQM7QWQi
— ChotaNews App (@ChotaNewsApp) June 13, 2026