E-Paper
Advertisement

Tirupati: తిరుపతి ఎస్వీ యూనివర్సిటీలో ఏం జరిగింది? అసోసియేట్ ప్రొఫెసర్ మృతి వెనుక, కొత్త కొత్త విషయాలు

Tirupati: తిరుపతి ఎస్వీ యూనివర్సిటీలో ఏం జరిగింది? అసోసియేట్ ప్రొఫెసర్ మృతి వెనుక, కొత్త కొత్త విషయాలు
Advertisement

Tirupati: తిరుపతి శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ అసోసియేట్ ప్రొఫెసర్ గుగులోతు సర్దార్ నాయక్ అనుమానాస్పదంగా మృతి చెందారు. సొంత కారులో ఆయన మృత దేహం లభ్యంకావడం కలకలం రేపింది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రుయా హాస్పిటల్‌కు తరలించారు. ఆయన మృతదేహాన్ని కుటుంబ సభ్యులు, స్థానికులు గుర్తించారు.

తిరుపతి ఎస్వీ యూనివర్సిటీలోఅసోసియేట్ ప్రొఫెసర్ మృతి

Advertisement

తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర యూనివర్సిటీ వివాదాలకు కేరాఫ్‌గా మారుతోంది. ర్యాగింగ్, వేధింపుల ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో ఓ ప్రొఫెసర్ సస్పెండ్ అయ్యారు. పలువురు అసిస్టెంట్ ప్రొఫెసర్ల అరెస్ట్‌లు జరిగాయి కూడా. తాజాగా ఆ యూనివర్సిటీకి చెందిన అసోసియేట్ ప్రొఫెసర్ గుగులోతు సర్దార్ నాయక్ అనుమానాస్పదంగా మృతి చెందిన ఘటన ఆలస్యంగా బయటకు వచ్చింది.

మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలంలోని తండ ధర్మారంకు చెందిన సర్దార్ నాయక్ ఎస్వీవర్సిటీలో అసోసియేట్ ప్రొఫెసరుగా ఉన్నారు. గడిచిన రెండు రోజులుగా ఆయన తన నివాసానికి రాలేదు. దీంతో ప్రొఫెసర్ కుటుంబసభ్యులు ఆందోళనకు గురయ్యారు. ఆయన ఆచూకీ కోసం గాలించారు.

Advertisement

కారులో విగత జీవిగా ప్రొఫెసర్ సర్దార్ నాయక్ 

ఎలాంటి ఫలితం లేకపోవడంతో శుక్రవారం వేకువజామున ప్రొఫెసర్ మృత దేహాన్ని ఆయన కారులో స్థానికులు గుర్తించారు. సర్దార్ నాయక్ కారులో విగతజీవిగా కనిపించారు. వెంటనే ఈ విషయాన్ని కుటుంబసభ్యులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఆ ప్రాంతానికి చేరుకున్న పోలీసులు, ఆధారాలను సేకరించారు.

సర్దార్ మరణించి ఎక్కువ రోజులు కావడంతో శరీరం తీవ్రమైన దుర్వాసన వచ్చింది. మృత దేహాన్ని పోస్టుమార్టం కోసం రుయా ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు. ఈ ఘటనతో కుటుంబసభ్యులు, తోటి ఉద్యోగులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

ALSO READ: భార్యపై అనుమానంతో పెట్రోల్ పోసి నిప్పుపెట్టిన భర్త

అనుమానాస్పద మృతి కావడంతో పూర్తి సేకరిస్తున్నారు పోలీసులు. యూనివర్సిటీలో ఏమైనా ఘటనలు జరిగాయా? ఫ్యామిలీలో ఏమైనా సమస్యలు ఉన్నాయా? అనే కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నారు. విచారణలో ఇంకెన్ని కొత్త విషయాలు వెలుగులోకి వస్తాయో చూడాలి.

Related News

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

Big Stories

Advertisement
×