Road Accident: బీహార్లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కాశీ నుంచి ఔరంగాబాద్ వెళ్తున్న ట్రావెల్ బస్సు అర్ధరాత్రి ఘోర ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందారు. మరో 15 మంది గాయపడ్డారు. మృతులంతా ఏపీకి చెందినవారు. క్షతగ్రాతులను సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అసలు ఘటన ఎలా జరిగింది?
బీహార్లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఏపీ వాసుల ముగ్గురు మృతి
నెల్లూరు జిల్లా సంగం నుంచి కాశీకి ట్రావెల్ బస్సులో బయులుదేరారు యాత్రికులు. ఆదివారం అర్ధరాత్రి ఆ బస్సు బీహార్లో ప్రమాదానికి గురైంది. ట్రావెల్ బస్సు బీహార్లోని ఔరంగాబాద్ సమీపంలోకి రాగానే ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో బస్సులోని ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు.
మరో 15 మంది తీవ్రంగా గాయపడడంతో వెంటనే వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. జూన్ ఒకటిన 43 మందితో ట్రావెల్ బస్సు బయలుదేరింది. ఆదివారం రాత్రి బీహార్లోని గయా నుంచి వారణాసికి వెళ్తున్న సమయంలో జాతీయ రహదారి 2పై ఎదురుగా వస్తున్న మరొక వాహనం ఢీకొట్టింది ట్రావెల్ బస్సు.
బీహార్ నుంచి కాశికి వెళ్తుండగా ప్రమాదానికి గురైన ట్రావెల్ బస్సు
దీంతో బస్సులో ఎడమ వైపు కూర్చొన్నవారిలో ముగ్గురు స్పాట్లోనే మృత్యువాత పడ్డారు. ఈ ఘటనలో బస్సులోని ప్రయాణికులు ఒక్కసారిగా షాకయ్యారు. బస్సులోని ప్రయాణికులు సంగం, ఆత్మకూరు ప్రాంతాలకు చెందినవారు ఉన్నారు. ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి వుంది.