TS Cyber Security: స్వేచ్ఛ బ్యూరో: అధికారికంగా సహాయం చేసేందుకు లంచం తీసుకున్న తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఇన్స్ పెక్టర్ బత్తుల మహేందర్ ను ఏసీబీ అధికారులు శనివారం రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. అనంతరం అతని ఇంట్లో సోదాలు జరిపి 13లక్షల నగదు, బంగారు నగలు, పలు ఆస్తులకు సంబంధించిన డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు.
సైబర్ సెక్యూరిటీ బ్యూరోలో సీఐగా పని చేస్తున్న మహేందర్ సైబర్ నేరంలో ఓ వ్యక్తిపై కేసులు నమోదు చేశారు. కాగా, సదరు వ్యక్తి కుటుంబ సభ్యులు, స్నేహితులపై కేసులు నమోదు చేయకుండా ఉండటానికి 9లక్షల రూపాయల లంచం డిమాండ్ చేశాడు. దీంట్లో ఇప్పటికే 5లక్షల రూపాయలు తీసుకున్నాడు. మిగితా 4లక్షల రూపాయల కోసం బెదిరిస్తూ వస్తున్నాడు.
దాంతో బాధితుడు ఏసీబీ అధికారులకు సమాచారం అందించాడు. ఈ క్రమంలో వలపన్నిన ఏసీబీ అధికారులు శనివారం సీఐ మహేందర్ తన ఆఫీస్ లో లంచం డబ్బు తీసుకుంటుండగా దాడి చేసి పట్టుకున్నారు. అనంతరం ఆయనను అదుపులోకి తీసుకున్నారు. మహేందర్ కూడబెట్టిన ఆస్తులు ఎన్ని? అన్న దిశగా విచారణ జరుపుతున్నారు.
Also Read: టేబుల్ మీద చర్చలు.. సరిహద్దుల్లో దాడులు.. అమెరికా, ఇరాన్ మధ్య అసలేం జరుగుతోంది?