Big Stories

Maddelacheruvu Suri Case: సూరి హత్య కేసు.. నిందితుడికి షాకిచ్చిన తెలంగాణ హైకోర్టు..

Maddelacheruvu Suri Case Accused: మద్దెలచెరువు సూరి హత్యకేసు నిందితుడు భానుకిరణ్‌కు తెలంగాణ హైకోర్టు షాకిచ్చింది. సూరి హత్య కేసులో నాంపలి కోర్టు ప్రధాన నిందితుడుకు భానుకిరణ్‌కు యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. కాగా దీన్ని సవాల్ చేస్తూ భాను కిరణ్ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. భాను కిరణ్ పిటిషన్‌పై విచారణ చేపట్టిన హైకోర్టు నాంపల్లి కోర్టు ఆదేశాలను సమర్ధించింది. నిందితుడికి యావజ్జీవ కారాగార శిక్ష విధించాల్సిందేనని.. భాను కిరణ్ పిటిషన్ కొట్టివేస్తూ హైకోర్టు తీర్పునిచ్చింది.

- Advertisement -

కాగా సూరి హత్య కేసులో భానుకిరణ్ ప్రధాన నిందితుడు. 2011 జనవరి 4న హైదరాబాద్ సనత్ నగర్‌లో భానుకిరణ్ రివాల్వర్‌తో సూరిని కాల్చి చంపాడు. దీంతో 2018 డిసెంబర్‌లో నాంపల్లి కోర్టు భానుకిరణ్‌కు జీవితఖైదు విధించింది. అప్పట్లో సూరి హత్య కేసు సంచలనంగా మారింది. నాంపల్లి కోర్టు తీర్పుపై హైకోర్టును ఆశ్రయించిన భాను కిరణ్‌కు చుక్కెదురైంది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News