AP CEO Mukesh Kumar Meena Press Meet: ఆంధ్రప్రదేశ్ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేశ్ కుమార్ మీనా ప్రెస్ మీట్ నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా 46, 165 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశామని తెలిపారు. ఇక ఏపీలో మొత్తం 4.14 కోట్ల ఓటర్లు ఉన్నారన్నారు. ఇందులో 65,707 మంది సర్వీస్ ఓటర్లు ఉన్నట్లు పేర్కొన్నారు.
ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఒక్కో పోలింగ్ కేంద్రంలో 1,500 మంది ఓటర్లకు అవకాశం కల్పించామన్నారు. ఒకవేళ ఒటర్ల సంఖ్య 1500 దాటితే ఆక్సిలరీ పోలింగ్ కేంద్రం ఏర్పాటు చేస్తామన్నారు.
ఇక సీవిజిల్ కింద 16 వేల కంప్లైంట్లు వచ్చాయన్నారు. అందులో 10 వేల కేసుల మీద చర్యలు తీసుకున్నామన్నారు. మొత్తం 150 ఇంటర్ స్టేట్ చెక్ పోస్టులను ఏర్పాటు చేశామని.. 181 ఇంట్రా స్టేట్ చెక్ పోస్టులను ఏర్పాటు చేశామన్నారు.
Also Read: తెలంగాణలో పోలింగ్ సమయాన్ని పెంచిన ఈసీ..
ఇప్పటివరకు రూ. 203 కోట్లు సీజ్ చేశామని ముఖేశ్ కుమార్ మీనా తెలిపారు. రూ. 47 కోట్లు నగదు కాగా, రూ. 20 కోట్ల మద్యాన్ని సీజ్ చేశామని స్పష్టం చేశారు. సమస్యాత్మక నియోజకవర్గాల్లో 100 శాతం వెబ్ కాస్టింగ్ చేపడ్తామన్నారు.