E-Paper
Advertisement

Vikarabad Crime: నువ్వసలు కూతురివేనా..? తెల్లారితే పెళ్లిచూపులు.. ప్రియుడి కోసం తల్లిదండ్రులను చంపి

Vikarabad Crime: నువ్వసలు కూతురివేనా..? తెల్లారితే పెళ్లిచూపులు.. ప్రియుడి కోసం తల్లిదండ్రులను చంపి

Vikarabad Crime: వికారాబాద్ జిల్లా బంట్వరం మండలం యాచారం గ్రామంలో సభ్య సమాజం తలదించుకునే ఘటన వెలుగులోకి వచ్చింది. కేవలం రెండు నెలల క్రితం ఇన్‌స్టాగ్రామ్ ద్వారా పరిచయమైన వ్యక్తితో ప్రేమలో పడిన ఓ యువతి, తన వివాహానికి అడ్డొస్తున్నారనే కారణంతో కన్న తల్లిదండ్రులనే అత్యంత కిరాతకంగా అంతమొందించింది. ప్రభుత్వ ఆసుపత్రిలో నర్సుగా పనిచేస్తూ, తల్లిదండ్రులకు ఆసరాగా ఉండాల్సిన కూతురే వారి ప్రాణాలు తీయడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.

పథకం ప్రకారం హత్య..
నిందితురాలు ఇంటికి చిన్న కుమార్తె కావడంతో తల్లిదండ్రులు ఆమెను ఎంతో గారబంగా పెంచారు. అయితే, సోషల్ మీడియాలో పరిచయమైన యువకుడితో ఆమె ప్రేమాయణం సాగించింది. ఈ క్రమంలో ఆమెకు మరో వ్యక్తితో పెళ్లి నిశ్చయించేందుకు తల్లిదండ్రులు పెళ్లి చూపులు ఏర్పాటు చేశారు. తెల్లవారితే పెళ్లి చూపులు అనగా, తన ప్రేమకు వారు అడ్డుగా మారుతారని భావించిన ఆమె, వృత్తిరీత్యా తనకు ఉన్న పరిజ్ఞానాన్ని ఉపయోగించి వారిని హతమార్చాలని నిర్ణయించుకుంది.

మత్తు ఇంజక్షన్లతో ఘాతుకం..
బాధిత దంపతులు గాఢ నిద్రలో ఉన్న సమయంలో, నిందితురాలు వారికి మత్తు ఇంజక్షన్లు ఇచ్చింది. మోతాదుకు మించి మత్తు మందు ఇవ్వడంతో వారు అపస్మారక స్థితిలోకి వెళ్లి ప్రాణాలు విడిచారు. తొలుత ఈ మరణాలు సహజమైనవిగా చిత్రీకరించే ప్రయత్నం జరిగినప్పటికీ, మృతదేహాల పరిస్థితిపై అనుమానం రావడంతో పోలీసులు రంగంలోకి దిగారు. పోస్టుమార్టం నివేదికలో శరీరంలోకి విషపూరిత రసాయనాలు చేరాయని తేలడంతో అసలు నిజం బయటపడింది.

పోలీసుల విచారణలో నిజాలు..
డీఎస్పీ శ్రీనివాస్ రెడ్డి మీడియా సమావేశంలో వెల్లడించిన వివరాల ప్రకారం.. నిందితురాలిని అదుపులోకి తీసుకుని విచారించగా, ఆమె తన నేరాన్ని అంగీకరించింది. ఇన్స్టాగ్రామ్ ప్రియుడితో కలిసి జీవించాలనే కోరికతోనే ఈ దారుణానికి ఒడిగట్టినట్లు వెల్లడించింది. కొడుకు లేకపోయినా తమను బాగా చూసుకుంటుందని నమ్మిన కూతురే కాలయముడిలా మారడంతో ఆ కుటుంబంలో తీరని శోకం మిగిలింది.

Also Read: ఉద్యోగం కోసం వెళ్లి విగతజీవిగా.. అమెరికాలో తెలంగాణ టెక్కీ కన్నుమూత

సమాజానికి హెచ్చరిక
సోషల్ మీడియాను సన్మార్గంలో వాడాల్సింది పోయి, యువత పెడదారి పడుతున్నారనే దానికి ఈ ఘటన ఒక నిదర్శనం. క్షణికావేశంలో తీసుకునే నిర్ణయాలు, అతివ్యామోహం కన్నవారి ప్రాణాలను తీసే స్థాయికి దిగజార్చడం విచారకరం. ప్రస్తుతం పోలీసులు నిందితురాలిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.

Related News

అమీర్‌పేటలోని షాపింగ్ కాంప్లెక్స్‌లో అగ్ని ప్రమాదం.. ఎగసిపడుతున్న మంటలు!

కూకట్‌పల్లిలో దారుణం.. భార్యను చంపి పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయిన భర్త!

ఏపీలో దారుణం.. వీడియోలు తీస్తూ మ‌హిళ‌పై అత్యాచారం

అరుణాచలం గిరిప్రదక్షిణ దారిలో ఘోరం..ఇద్దరు యువతులపై గ్యాంగ్‌రే*ప్

గంజాయి డాన్‌గా మారిన సస్పెండెడ్ కానిస్టేబుల్.. రూ.79 లక్షల డ్రగ్స్ సీజ్!

ఆసుపత్రిలో అగ్నిప్రమాదం.. 10 మంది మృతి? మృతులు పెరిగే అవకాశం, పేషెంట్ల బంధువుల్లో టెన్షన్

అనంతపురంలో ఘరానా మోసం.. స్టాక్ మార్కెట్ పేరుతో రూ.25 కోట్లు స్కామ్!

ఢిల్లీ రెస్టారెంట్‌లో భారీ అగ్నిప్రమాదం.. 21 మంది మృతి

Big Stories

×