E-Paper
Advertisement

Vikarabad District Crime: పెళ్ళాం ఊరెళ్లిందని.. ఓ భర్త చేసిన నిర్వాకం.. ఏకంగా కన్న కొడుకుపైనే..

Vikarabad District Crime: పెళ్ళాం ఊరెళ్లిందని.. ఓ భర్త చేసిన నిర్వాకం.. ఏకంగా కన్న కొడుకుపైనే..

Vikarabad District Crime: పెళ్ళాం ఊరెళితే సినిమా చూసే ఉంటారుగా. ఆ సినిమాలో పెళ్ళాం ఊరెళితే.. భర్తలు చేసే ఎంజాయ్ మెంట్ అంతా ఇంతా కాదు. అసలు ఎప్పుడెప్పుడా ఊరెళ్లేది అనే తరహాలో ఉంటుంది వారి ఎంజాయ్. కానీ ఇక్కడ ఓ భర్త, పెళ్ళాం ఊరెళితే కొడుకును చావబాదాడు. అంతేకాదు మరో దారుణానికి ఒడిగట్టాడు. అసలేం జరిగిందంటే..

వికారాబాద్ జిల్లా తాండూరు మండలం మల్కాపూర్ గ్రామానికి చెందిన మల్కేడ్ హనుమంతుకు భార్య, ఒక కొడుకు ఉన్నారు. అయితే హనుమంతు రోజూ ఇంటికి వచ్చి భార్యతో ఘర్షణ పడేవాడు. రోజురోజుకు భర్త వేధింపులు తాళలేక భార్య, కుమారుడిని వదిలిపెట్టి తన పుట్టింటికి వెళ్ళిపోయింది. అలా తన భార్య తనను వదిలి వెళ్లడంతో హనుమంతు ఆవేదన చెందాడు. రోజులు గడిచాయి. భార్య మాత్రం రావడం లేదు. ఇలా వేచి చూసిన హనుమంతు భార్య తిరిగి రాకపోవడంతో కొడుకుపై కోపం చూపేవాడట.

ఎలాగైనా తన భార్యను తన ఇంటికి రప్పించాలని అనుకున్న హనుమంతు క్రూరంగా ఆలోచించాడు. ఏకంగా తన కుమారుడిని కత్తితో దాడి చేస్తే, భార్య తప్పక వస్తుందని భావించాడు. అలా అనుకున్నదే తడవు కత్తి చేతబట్టి కొడుకుపైకి దాడికి పాల్పడ్డాడు. ఈ దాడిలో కొడుకు అరవింద్ కు తీవ్రగాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేశారు.

Also Read: Seethaka Speech: తెలంగాణ తల్లికి నీ చెల్లి రూపం ఇచ్చినప్పుడు ఏమైంది? సీతక్క వైల్డ్ ఫైర్ స్పీచ్

అయితే భార్య పుట్టింటికి వెళ్లి రాకుంటే వెళ్లి పిలిస్తే సరిపోతుంది కానీ, ఏకంగా కొడుకుపై కత్తితో దాడి చేయడం ఏమిటని స్థానికులు చర్చించుకున్నారు. ఏదిఏమైనా అదృష్టవశాత్తు కొడుకు అరవింద్ కు పెను ప్రమాదం తప్పినా, భార్య రాకుంటే కొడుకుపై నీ ప్రతాపం చూపుతావా అంటూ హనుమంతుపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

Related News

అమీర్‌పేటలోని షాపింగ్ కాంప్లెక్స్‌లో అగ్ని ప్రమాదం.. ఎగసిపడుతున్న మంటలు!

కూకట్‌పల్లిలో దారుణం.. భార్యను చంపి పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయిన భర్త!

ఏపీలో దారుణం.. వీడియోలు తీస్తూ మ‌హిళ‌పై అత్యాచారం

అరుణాచలం గిరిప్రదక్షిణ దారిలో ఘోరం..ఇద్దరు యువతులపై గ్యాంగ్‌రే*ప్

గంజాయి డాన్‌గా మారిన సస్పెండెడ్ కానిస్టేబుల్.. రూ.79 లక్షల డ్రగ్స్ సీజ్!

ఆసుపత్రిలో అగ్నిప్రమాదం.. 10 మంది మృతి? మృతులు పెరిగే అవకాశం, పేషెంట్ల బంధువుల్లో టెన్షన్

అనంతపురంలో ఘరానా మోసం.. స్టాక్ మార్కెట్ పేరుతో రూ.25 కోట్లు స్కామ్!

ఢిల్లీ రెస్టారెంట్‌లో భారీ అగ్నిప్రమాదం.. 21 మంది మృతి

Big Stories

×