Vikarabad: వికారాబాద్ జిల్లా మర్పల్లి మండల కేంద్రంలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. స్థానిక ఒక హోటల్కు సంబంధించిన స్లాబ్ అకస్మాత్తుగా కుప్పకూలిపోయింది. ఈ ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.
ఘటన జరిగిన వెంటనే స్థానికులు స్పందించి శిథిలాల కింద చిక్కుకున్న మరో ఇద్దరిని సురక్షితంగా బయటకు తీశారు. ప్రస్తుతం ఘటనా స్థలానికి చేరుకున్న రెస్క్యూ సిబ్బంది జేసీబీ సహాయంతో శిథిలాలను తొలగిస్తూ సహాయక చర్యలు ముమ్మరం చేశారు. ప్రమాద సమయంలో హోటల్లో ఎంతమంది ఉన్నారనేది, ఇంకా శిథిలాల కింద ఎవరైనా చిక్కుకున్నారా అనే పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Also Read: హైదరాబాద్లో ఎబోలా కలవరం.. ఒకరికి నెగటివ్, రెండో కేసుపై ఉత్కంఠ!
వికారాబాద్లో కుప్పకూలిన హోటల్ స్లాబ్.. ఒకరి మృతి
మర్పల్లి మండల కేంద్రంలో ప్రమాదం జరిగింది. ఓ హోటల్ స్లాబ్ కూలడంతో ఒకరు మృతి చెందారు. శిథిలాల నుంచి మరో ఇద్దరిని స్థానికులు బయటకు తీశారు. జేసీబీ సాయంతో ఘటనా స్థలిలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. శిథిలాల కింద ఇంకా ఎంత మంది… pic.twitter.com/VebJcUxqEy
— ChotaNews App (@ChotaNewsApp) June 6, 2026