Visakha Express: విశాఖ ఎక్స్ప్రెస్లో దారుణమైన ఘటన చోటుచేసుకుంది. రైలు ప్రయాణం అంటేనే సురక్షితం అనుకునే రోజులు పోయాయి అనిపిస్తోంది. పల్నాడు జిల్లాకు చెందిన దంపతులు విశాఖ నుంచి తమ స్వగ్రామానికి వెళ్తుండగా జరిగిన ఈ ఉదంతం ప్రయాణికుల్లో భయాందోళనలు కలిగిస్తోంది.
సాధారణంగా రైలు రద్దీగా ఉన్నప్పుడు ఎవరైనా సాయం చేస్తామంటే నమ్మడం సహజం. అదే ఇక్కడ బాధితురాలి పాలిట శాపమైంది. రైలు గుడివాడ – విజయవాడ మధ్యలో ఉన్న సమయంలో, ఏసీ కోచ్లో సీటు ఖాళీగా ఉందని నమ్మబలికిన నిందితుడు, ఆమెను లోపలికి తీసుకెళ్లి ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. భర్తతో కలిసి ప్రయాణిస్తున్నప్పటికీ, కళ్లెదుటే ఇంత దారుణం జరగడం రైల్వే భద్రతా వ్యవస్థలోని లోపాలను ఎత్తిచూపుతోంది.
ఆ మహిళ ధైర్యం చేసి నడికూడ స్టేషన్లో దిగాక భర్తకు జరిగిన విషయం చెప్పడంతో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. వెంటనే స్పందించిన పోలీసులు ‘జీరో ఎఫ్ఐఆర్’ నమోదు చేసి కేసును విజయవాడ రైల్వే పోలీసులకు బదిలీ చేశారు. అయితే, ఏసీ భోగీల్లో టీటీఈలు, అటెండెంట్లు ఉండగా ఒక అపరిచిత వ్యక్తి ఇంత సాహసం ఎలా చేయగలిగాడనేది పెద్ద ప్రశ్న.
Also Read: హరీశ్ రావు బహిరంగ లేఖ.. రేవంత్ రెడ్డికి గుక్కతిప్పుకోనివ్వని ప్రశ్నలు!