E-Paper
Advertisement

విశాఖలో తీవ్ర విషాదం.. దంపతుల అనుమానాస్పద మృతి!

విశాఖలో తీవ్ర విషాదం.. దంపతుల అనుమానాస్పద మృతి!

Visakhapatnam: విశాఖపట్నంలో తీవ్ర విషాదం నింపిన దారుణ ఘటన చోటుచేసుకుంది. ద్వారకా నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని శ్రీనగర్, రామా టాకీస్ థియేటర్ వెనుక ఉన్న ఒక అపార్ట్‌మెంట్‌లో భార్యాభర్తలు అనుమానాస్పద స్థితిలో శవమై కనిపించారు.

ఆ బిల్డింగ్ రెండో అంతస్తులో నివసిస్తున్న బాలరాం( 33), ప్రియాంక (27) దంపతులు ఆదివారం అర్ధరాత్రి తమ నివాసంలో విగతజీవులుగా పడి ఉండటాన్ని గమనించారు. భర్త బాలరాం గదిలో ఉరివేసుకుని వేలాడుతుండగా.. భార్య ప్రియాంక కింద మృత్యువాత పడి ఉంది. సమాచారం అందుకున్న నైట్ రౌండ్స్ క్రైమ్ ఎస్ఐ వెంటనే అక్కడికి చేరుకుని క్షుణ్ణంగా పరిశీలించారు.

అయితే, ఇది ఆత్మహత్యా లేక ఏదైనా ఘోరం జరిగిందా అనే కోణంలో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేసి, మృతదేహాలను పోస్ట్ మార్టం నిమిత్తం ఆసుపత్రికి  తరలించారు.

Also Read: రేవంత్ ఒక హిట్లర్.. విద్యాశాఖ ఒక సర్కస్.. కవిత సంచలనం!

Related News

గేమ్స్ ఆడొద్దన్నందుకు.. కన్నవారిపైనే కత్తితో దాడి చేసిన 16 ఏళ్ల బాలుడు!

కురుక్షేత్ర ఆసుపత్రిలో దారుణం.. రూ.100 ఇచ్చి 15 ఏళ్ల బాలికపై డాక్టర్ అత్యాచారం!

మాచర్లలోని సినిమా థియేటర్‌లో భారీ అగ్ని ప్రమాదం

ఎమర్జెన్సీ ల్యాండింగ్.. పేలిపోయిన విమానం

ప్రమాదానికి గురైన ట్రావెల్ బస్సు.. ఏపీ వాసుల ముగ్గురు మృతి, మరో 15 మంది గాయాలు, బీహార్‌లో ఘటన

పాతబస్తీలో దారుణం.. భార్య గొంతుకోసి, పిల్లలను గదిలో బంధించి భర్త పరారు!

ఆన్‌లైన్‌ బెట్టింగ్‌ అప్పుల భారం..? రైల్వే ఉద్యోగి ఆత్మహత్య!

Big Stories

×