Visakhapatnam: విశాఖపట్నంలో తీవ్ర విషాదం నింపిన దారుణ ఘటన చోటుచేసుకుంది. ద్వారకా నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని శ్రీనగర్, రామా టాకీస్ థియేటర్ వెనుక ఉన్న ఒక అపార్ట్మెంట్లో భార్యాభర్తలు అనుమానాస్పద స్థితిలో శవమై కనిపించారు.
ఆ బిల్డింగ్ రెండో అంతస్తులో నివసిస్తున్న బాలరాం( 33), ప్రియాంక (27) దంపతులు ఆదివారం అర్ధరాత్రి తమ నివాసంలో విగతజీవులుగా పడి ఉండటాన్ని గమనించారు. భర్త బాలరాం గదిలో ఉరివేసుకుని వేలాడుతుండగా.. భార్య ప్రియాంక కింద మృత్యువాత పడి ఉంది. సమాచారం అందుకున్న నైట్ రౌండ్స్ క్రైమ్ ఎస్ఐ వెంటనే అక్కడికి చేరుకుని క్షుణ్ణంగా పరిశీలించారు.
అయితే, ఇది ఆత్మహత్యా లేక ఏదైనా ఘోరం జరిగిందా అనే కోణంలో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేసి, మృతదేహాలను పోస్ట్ మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
Also Read: రేవంత్ ఒక హిట్లర్.. విద్యాశాఖ ఒక సర్కస్.. కవిత సంచలనం!