E-Paper
Advertisement

Road Accident: పెళ్లి వాహనాన్ని ఢీ కొట్టిన లారీ.. ముగ్గురు మృతి

Road Accident: పెళ్లి వాహనాన్ని ఢీ కొట్టిన లారీ.. ముగ్గురు మృతి

Road Accident: హనుమకొండ జిల్లా గోపాల్‌పూర్ క్రాస్‌రోడ్డు వద్ద.. ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.పెళ్లి బృందంతో వెళ్తున్న బొలేరో వాహనాన్ని బోర్ వెల్స్ లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందగా.. మరో 12 మందికి తీవ్ర గాయాలు అయినట్లు తెలుస్తోంది. వారిలో ఐదుగురు పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.

వివరాల్లోకి వెళ్తే.. మహబూబాబాద్ జిల్లా కురవి మండలం సూదన్‌పల్లి గ్రామానికి చెందిన ఓ యువతికి.. సిద్దిపేట జిల్లా నంగనూరు మండలం వెంటకాపురం గ్రామానికి చెందిన యువకుడితో వివాహం జరిగింది. ఆనందోత్సాహాల మధ్య జరిగిన ఈ వివాహ వేడుక ముగిసిన అనంతరం, వధువు బృందం వరుడి ఇంటి నుంచి తిరిగి మహబూబాబాద్ బయలుదేరింది. ఈ నేపథ్యంలో గోపాల్ పుర్ వద్ద బొలేరో వాహనాన్ని ఆపారు. దీంతో వెనుక నుంచి వచ్చిన లారీ వాహనాన్ని ఢీకొట్టింది.

దీంతో అక్కడికక్కడే ముగ్గురు ప్రాణాలు కోల్పోగా.. మరో 12 మందికి తీవ్ర గాయాలు అయినట్లు తెలుస్తోంది. వీరిలో ఐదుగురు పరిస్థితి విషమంగా ఉంది. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని.. క్షతగాత్రులను సమీప ఆసుపత్రికి తరలించారు.
ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. లారీ డ్రైవర్ మద్యం సేవించి వాహనం నడిపాడా లేక మరేదైనా కారణం ఉందా అన్న కోణంలో  విచారణ సాగుతోంది. లారీ డ్రైవర్ పారిపోయినట్లు సమాచారం. వాహనాలను క్రేన్ సాయంతో అక్కడి నుంచి తరలించారు. ప్రమాదం కారణంగా ఆ ప్రాంతంలో ట్రాఫిక్‌ కొంతసేపు నిలిచిపోయింది.

 

Related News

అనంతపురంలో ఘరానా మోసం.. స్టాక్ మార్కెట్ పేరుతో రూ.25 కోట్లు స్కామ్!

ఢిల్లీ రెస్టారెంట్‌లో భారీ అగ్నిప్రమాదం.. 21 మంది మృతి

విశాఖలో ఘరానా మోసం.. క్రిప్టో కరెన్సీ పేరిట రూ.10 కోట్లు వసూలు!

దుర్గంచెరువు కేబుల్ బ్రిడ్జిపై ఘోరం.. యువతి ఆత్మహత్య!

‘కిల్లర్’ మూవీ సెట్లో విషాదం.. గ్యాస్ సిలిండర్ పేలి టెక్నీషియన్ మృతి

ఏపీలో వేర్వేరు ప్రాంతాల్లో ఘోర రోడ్డు ప్రమాదం.. విశాఖలో రెండు వాహనాలను ఢీ కొట్టిన బొలెరో వ్యాన్

Medchal Crime: అల్వాల్‌లో దొంగల బీభత్సం కలకలం.. 30 తులాల బంగారం చోరీ..!

ఆర్టీసీ బస్సులో గంజాయి దందా.. తనిఖీల్లో పోలీసులకే దిమ్మతిరిగే షాక్!

Big Stories

×