BigTV English
Advertisement

Kurnool Bus Accident: బస్సు కాలిన చోట.. బంగారం వేట.. వీళ్లకి మానవత్వం ఉందా?

Kurnool Bus Accident: బస్సు కాలిన చోట.. బంగారం వేట.. వీళ్లకి మానవత్వం ఉందా?

Kurnool Bus Accident: కర్నూలు చిన్నటేకూరు వద్ద జరిగిన బస్సు ప్రమాదం 19 మంది ప్రాణాలను బలిగొంది. దేశవ్యాప్తంగా కన్నీళ్లు పెట్టించిన ఈ ఘటనలో కాలిబూడిదైన మృతదేహాలను అధికారులు గుర్తించి.. ఇప్పటికే కుటుంబ సభ్యులకు అప్పగించారు. బస్సు ప్రమాద ఘటన వద్ద క్షుణ్ణంగా పరిశీలించి.. విచారణ నిమిత్తం అక్కడి వస్తువులను తరలించారు. అయితే ఈ ప్రమాద ఘటన స్థలానికి దగ్గరలో ఉన్న మహబూబ్‌నగర్‌ జిల్లా వాసులకు దురాశ పుట్టింది.


కర్నూలు బస్సు ప్రమాదంలో మృతదేహాలు పూర్తిగా కాలిపోయాయి. దీంతో వారు ధరించిన బంగారం, వెండి ఆభరణాలు సైతం మంటల్లో దగ్ధం అయ్యాయి. అయితే మృతుల ఆభరణాలు కరిగి బూడిదలో ఉంటాయనే ఆశతో.. మహబూబ్‌నగర్‌కు చెందిన కొన్ని కుటుంబాలు నిన్న బస్సు దుర్ఘటన ప్రాంతానికి చేరుకున్నాయి. అక్కడి బూడిదను సంచుల్లో సేకరించి, ప్రమాద స్థలం దగ్గర ఉన్న ఓ కుంట వద్దకు తీసుకెళ్లారు. వాటిని నీటిలో కడిగి మరీ పరీక్షించారు. ఈ ప్రమాదం ఎన్నో కుటుంబాల్లో విషాదం నింపితే… వీళ్లు మాత్రం బంగారం, వెండి కోసం దూరప్రాంతం నుంచి రావడం అందరినీ ఆశ్చర్యపోయేలా చేస్తోంది.


Related News

Lovers Suicide: నీవు లేక నేను లేనని.. ప్రేయసి మృతిని తట్టుకోలేక ప్రియుడు సూసైడ్

Bengaluru Crime: అడ్డంగా దొరికిపోయారు ఆ దంపతులు.. యువకుడ్ని కారుతో గుద్ది, అసలు విషయం ఏంటంటే..

Road Accident: కాళ్ల పారాణి ఆరకముందే.. నవ వధువు రోడ్డు ప్రమాదంలో మృతి

Hyderabad Crime: ఫ్రెండ్స్‌తో పార్టీ.. మరుసటి రోజు ఎయిర్‌‌హోస్టెస్‌ సూసైడ్, ఆ వార్తలపై ఫ్యామిలీ క్లారిటీ

Chennai Crime: చెన్నైలో దారుణం.. మహిళపై లైంగిక దాడి, బైక్ ట్యాక్సీ డ్రైవర్ అరెస్ట్

Indian Man: విమానంలో భారతీయుడు వీరంగం.. ఇద్దరు టీనేజర్లపై దాడి, నిందితుడి ప్రణీత్ అరెస్ట్

Crime in Flight: విమానంలో మెటల్ ఫోర్క్‌తో ఇద్దరిని పొడిచాడు.. సిబ్బంది అదుపు చేయడానికి ప్రయత్నించినప్పటకీ..?

Big Stories

×