E-Paper
Advertisement

Hyderabad News: భార్యభర్తల మధ్య గొడవలు.. భర్తని చంపేసిన భార్య, కోకాపేట్‌లో దారుణం

Hyderabad News: భార్యభర్తల మధ్య గొడవలు.. భర్తని చంపేసిన భార్య, కోకాపేట్‌లో దారుణం

Hyderabad News:  ఆ భార్యభర్తల మధ్య ఏం జరిగిందో తెలీదు. వారిద్దరి మధ్య విభేదాలు చల్లారలేదు. ఫలితంగా భర్తను ఈ లోకం నుంచి పంపేయాలని డిసైడ్ అయ్యింది ఆ ఇంటి ఇల్లాలు. కరెక్టుగా అలాగే చేసింది. చివరకు భర్తను చంపిసేంది భార్య. సంచలనం రేపిన ఈ ఘటన హైదరాబాద్ సిటీలోని కోకాపేట్ ప్రాంతంలో చోటు చేసుకుంది.

అస్సాంకి చెందిన భార్యాభర్తలు హైదరాబాద్‌లో కొన్నాళ్లుగా జీవనం సాగిస్తున్నారు. ప్రస్తుతం ఆ జంట కోకాపేట్ ప్రాంతంలో నివాసం ఉంటోంది. స్థానికుల చెబుతున్న వివరాల మేరకు గురువారం రాత్రి దంపతుల మధ్య గొడవ జరిగింది. ఒకరిపై మరొకరు దాడి చేసుకున్నారు. ఆవేశం హద్దులు దాటడడంతో తీవ్ర ఆగ్రహానికి గురైన ఆ ఇంటి ఇల్లాలు.. ఏకంగా కత్తితో భర్తపై దాడి చేసింది.

అతగాడి కేకలు విని స్థానికులు వెంటనే అక్కడికి వెళ్లారు. రక్తపు మడుగులో ఉన్న బాధితుడిని ఆసుపత్రికి తరలించారు. ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన మృతి చెందాడు. ఈ ఘటనకు గురించి తెలియగానే పోలీసులు ఆసుపత్రికి వచ్చారు. కేసు నమోదు చేసినట్టు తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సివుంది.

 

Related News

అమీర్‌పేటలోని షాపింగ్ కాంప్లెక్స్‌లో అగ్ని ప్రమాదం.. ఎగసిపడుతున్న మంటలు!

కూకట్‌పల్లిలో దారుణం.. భార్యను చంపి పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయిన భర్త!

ఏపీలో దారుణం.. వీడియోలు తీస్తూ మ‌హిళ‌పై అత్యాచారం

అరుణాచలం గిరిప్రదక్షిణ దారిలో ఘోరం..ఇద్దరు యువతులపై గ్యాంగ్‌రే*ప్

గంజాయి డాన్‌గా మారిన సస్పెండెడ్ కానిస్టేబుల్.. రూ.79 లక్షల డ్రగ్స్ సీజ్!

ఆసుపత్రిలో అగ్నిప్రమాదం.. 10 మంది మృతి? మృతులు పెరిగే అవకాశం, పేషెంట్ల బంధువుల్లో టెన్షన్

అనంతపురంలో ఘరానా మోసం.. స్టాక్ మార్కెట్ పేరుతో రూ.25 కోట్లు స్కామ్!

ఢిల్లీ రెస్టారెంట్‌లో భారీ అగ్నిప్రమాదం.. 21 మంది మృతి

Big Stories

×