Medchal Road Accident: మేడ్చల్ స్వేచ్ఛ : మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఎల్లంపేట చౌరస్తా సమీపంలో సోమవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందాడు. పోలీసుల వివరాల ప్రకారం నాగ్పూర్ నుంచి మేడ్చల్ వైపు వస్తున్న లారీ (ఎంహెచ్40సీటీ6412)ను సంజయ్ కుమార్ విశ్వకర్మ (52) నడుపుతూ ఎల్లంపేట చౌరస్తా వద్దకు చేరుకోగా, రోడ్డు దాటుతున్న పప్పు కుమార్ రాణా (29) ఢీకొట్టింది. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన రాణా అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలిపారు. మృతుడు జార్ఖండ్ వాసిగా పోలీసులు గుర్తించారు.ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు పేర్కొన్నారు.
Also Read: HYDRAA: రూ.60 కోట్ల విలువైన భూమి సేఫ్.. ఇది కదా హైడ్రా పవర్ అంటే, ఎలా కాపాడారంటే..?
మేడ్చల్ స్వేచ్ఛ : మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో – ప్రతాపసింగారంలో మరోసారి దొంగలు రెచ్చిపోయారు . అర్ధరాత్రి ఎలక్ట్రికల్ అండ్ హార్డ్వేర్ షాపులో దుండగులు చోరీ చేశారు. దుకాణం షట్టర్ తాళాలు పగులగొట్టి లోపలికి చొరబడి కౌంటర్లో ఉన్న నగదు ఎత్తుకెళ్లారు.మొబైల్ ట్యాబ్, ఇతర సామాగ్రి కూడా చోరీ చేశారు . దొంగతనానికి సంబంధించి దృశ్యాలు సీసీటీవీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి. గత 20వ రోజులు కిందటే వరుసగా మూడు దొంగతనాలు జరిగాయి. వరుస దొంగతనాలతో స్థానిక ప్రజలు భయాందోళన గురవుతున్నారు.బాధితుడి ఫిర్యాదు మేరకు మేడిపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Also Read: Lucknow Crime: లంబోర్ఘిని కారు బీభత్సం.. గాల్లోకి ఎగిరిన యువకుడు, వ్యాపారి కొడుకుపై కేసు