E-Paper
Advertisement

Zojila Avalanche: జోజిలాలో మృత్యు మంచు.. 15 వాహనాలు సమాధి.. ఏడుగురు బలి!

Zojila Avalanche: జోజిలాలో మృత్యు మంచు.. 15 వాహనాలు సమాధి.. ఏడుగురు బలి!

Zojila Avalanche: జమ్మూకశ్మీర్‌లోని జోజిలా పాస్ సమీపంలో తీవ్ర విషాదమైన ఘటన చోటుచేసుకుంది. శ్రీనగర్-లేహ్ జాతీయ రహదారిపై ఒక్కసారిగా మంచు తుఫాను విరుచుకుపడటంతో ప్రయాణికులు దిగ్భ్రాంతికి గురయ్యారు. ఈ ప్రమాద ధాటికి సుమారు ఏడుగురు ప్రాణాలు కోల్పోగా.. మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో మహిళలు, చిన్న పిల్లలు ఉన్నట్టు సమాచారం.

సమాచారం అందుకున్న వెంటనే బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ (BRO), భారత సైన్యం , SDRF బృందాలు రంగంలోకి దిగాయి. మంచు కింద సుమారు 15 వాహనాలు చిక్కుకుపోయినట్లు అధికారులు గుర్తించారు. గడ్డకట్టే చలిని సైతం లెక్కచేయకుండా సహాయక బృందాలు మంచును తొలగించి, వాహనాల్లో చిక్కుకున్న వారిని బయటకు తీసేందుకు శ్రమిస్తున్నాయి.

ఈ ప్రమాదం కారణంగా శ్రీనగర్-లేహ్ జాతీయ రహదారిపై రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. రహదారిపై భారీగా మంచు పేరుకుపోవడంతో వందలాది వాహనాలు నిలిచిపోయి ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు. ప్రస్తుతం ఆ ప్రాంతంలో ప్రతికూల వాతావరణం నెలకొన్నందున, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అత్యవసరమైతే తప్ప ప్రయాణాలు చేయవద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు. మంచు చరియలు విరిగిపడే అవకాశం ఇంకా ఉన్నందున సహాయక చర్యలు సవాలుగా మారాయి.

Also Read: ఒకవైపు శాంతి.. మరోవైపు యుద్ధం.. ఇరాన్‌పై ట్రంప్ మాస్టర్ ప్లాన్ ఇదే!

Related News

Children Missing: ఒంగోలులో దారుణం.. నీటి కుంటలో నలుగురు చిన్నారులు గల్లంతు!

అమీర్‌పేటలోని షాపింగ్ కాంప్లెక్స్‌లో అగ్ని ప్రమాదం.. ఎగసిపడుతున్న మంటలు!

కూకట్‌పల్లిలో దారుణం.. భార్యను చంపి పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయిన భర్త!

ఏపీలో దారుణం.. వీడియోలు తీస్తూ మ‌హిళ‌పై అత్యాచారం

అరుణాచలం గిరిప్రదక్షిణ దారిలో ఘోరం..ఇద్దరు యువతులపై గ్యాంగ్‌రే*ప్

గంజాయి డాన్‌గా మారిన సస్పెండెడ్ కానిస్టేబుల్.. రూ.79 లక్షల డ్రగ్స్ సీజ్!

ఆసుపత్రిలో అగ్నిప్రమాదం.. 10 మంది మృతి? మృతులు పెరిగే అవకాశం, పేషెంట్ల బంధువుల్లో టెన్షన్

అనంతపురంలో ఘరానా మోసం.. స్టాక్ మార్కెట్ పేరుతో రూ.25 కోట్లు స్కామ్!

Big Stories

×