E-Paper
Advertisement

Vishnu Temples in India: దేశంలోని 5 ప్రసిద్ధ విష్ణు దేవాలయాలు, విశిష్టత

Vishnu Temples in India: దేశంలోని 5 ప్రసిద్ధ విష్ణు దేవాలయాలు, విశిష్టత
Advertisement

Vishnu Temples in India: హిందూ పురాణాల ప్రకారం త్రిమూర్తుల్లో ఒకరైన విష్ణువును లోక రక్షకుడిగా చెబుతారు. లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవడానికి శ్రీమహా విష్ణువును ముందుగా పూజిస్తూ ఉంటారు. హరి అనుగ్రహం ఎవరిపై కురుస్తుందో వారి పట్ల లక్ష్మీ దేవి అనుగ్రహం ఉంటుందని విశ్వసిస్తారు. లక్ష్మీ దేవి అనుగ్రహం ఉన్న మానవ జీవితంలో దేనికి లోటు ఉండదు.

జీవితంలోని అన్ని ఆనందాలను అనుభవించిన తర్వాత అతను చివరకు శ్రీహరి పాదాల వద్ద చోటు పొందుతాడని పురాణాలు చెబుతున్నాయి. అతంటి మహిమ కలిగిన విష్ణు ఆలయాలు దేశంలోని అనేక ప్రాంతాల్లో ఉన్నాయి. అందులో 5 విష్ణుదేవాలయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

Advertisement

బద్రీనాథ్ దేవాలయం (ఉత్తరాఖండ్):

హిందూ మతాన్ని విశ్వసించే ప్రతి ఒక్కరు తమ జీవితంలో ఒక్కసారైనా ఛార్ థామ్ యాత్ర చేయాలని అనుకుంటారు. చార్ థామ్ యాత్రలోని పవిత్ర పుణ్య క్షేత్రాల్లో బద్రీనాథ్ ఒకటి. హిందూ పురాణాల ప్రకారం , శ్రీ విష్ణువు యొక్క 24 రూపాల్లో ఒకటి బద్రీనాథ్ అవతారం అని చెబుతారు. ఏ ఆలయ తలుపులు అయినా ఒక తాళపు చెవి ద్వారా తెరుస్తారు. కానీ బద్రీనాథ్ తలుపులు మాత్రం మూడు తాళపు చెవిల ద్వారా తెరవబడుతుంది. బద్రీనాథ్ ఆలయం గురించి మరో ముఖ్య విషయం ఏమిటంటే ఈ ఆలయం ఆరు నెలల పాటు మాత్రమే తెరుచుకుని ఉంటుంది. మరో ఆరు నెలలు భక్తుల దర్శనాలను నిలిపివేస్తారు. విదేశాల నుంచి కూడా ఉత్తరాఖండ్‌కు భక్తులు వస్తుంటారు.
పద్మనాభస్వామి ఆలయం (కేరళ):
కేరళ రాజధాని తిరువనంతపురంలో ఉన్న అనంత పద్మనాభస్వామి ఆలయంలో విష్ణుమూర్తి నిద్రిస్తున్న భంగిమలో  ఉంటాడు. ఈ విగ్రహాన్ని దర్శించుకునేందుకు భారీ సంఖ్యలో భక్తులు సుదూర ప్రాంతాల నుంచి వస్తుంటారు. ఈ ఆలయం దేశంలోనే గొప్ప దేవాలయాల్లో ఒకటిగా చెప్పబడుతోంది. ఆలయ గర్భగుడిలోనే శ్రీహరి విగ్రహం లభించిందని చెబుతుంటారు. సాంప్రదాయమైన దుస్తుల్లో ఉన్న స్త్రీ, పురుషులకు మాత్రమే ఈ ఆలయంలోకి అనుమతి ఇస్తారు. ఈ ఆలయం అత్యంత ధనిక దేవాలయంగా పరిగణించబడుతోంది. ఈ ఆలయ ఖజానాలో వజ్రాలు, బంగారు ఆభరణాలు,బంగారు విగ్రహాలు ఉన్నాయని చెబుతుంటారు.

Advertisement

Also Read: తొలి ఏకాదశి రోజు ఈ పనులు అస్సలు చేయకూడదు

పండరీపుర ఆలయం (మహారాష్ట్ర):
మహారాష్ట్రలో ఉన్న ప్రసిద్ధ విష్ణు దేవాలయం పండరీపుర ఆలయం. షోలాపూర్ జిల్లాలోని పండరీపురంలో ఈ ఆలయం ఉంది. భీమా నది ఓడ్డున ఉన్న ఈ ఆలయంలో విష్ణువు కొలువుదీరి ఉన్నాడు. ఆషాఢ ఏకాదశి, కార్తీక ఏకాదశి పర్వదినాల్లో ఈ ఆలయానికి భక్తులు భారీగా తరలివస్తారు. భీమా నదిలో స్నానాలు ఆచరిస్తే అన్ని పాపాలు తొలగిపోతాయని భక్తులు నమ్ముతారు. ఈ ఆలయానికి మరో ప్రత్యేకత కూడా ఉంది. వెనకబడిన కులాలకు చెందిన వారు ఇక్కడ పూజా కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు.

Tags

Related News

తిరుమల శ్రీవారి తొలి దర్శనం.. వారికే ఎందుకు? దాని వెనుక కథేంటి?

పూరీ జగన్నాథుడి మహాప్రసాదం తయారీలో..ఆశ్చర్యకరమైన నిజాలు!

శుక్రవారం ఈ 5 పవిత్ర స్థలాల్లో దీపం పెడితే.. అష్టైశ్వర్యాలు మీ సొంతం

రుద్రాక్ష ధరిస్తున్నారా? ఈ తప్పులు చేస్తే.. నష్టాలు తప్పవు!

బ్రహ్మ ముహూర్తంలో కలలు వస్తున్నాయా? మీ జీవితం మారబోతుందనడానికి ఇదో సంకేతం!

జాతకంలో గ్రహ దోషాలు పోవాలా? ఈ వస్తువులు దానం చేస్తే తిరుగుండదు!

ఏ వేప చెట్టు పడితే అది వాడరు! పూరీ జగన్నాథుడి రథాల కోసం చెట్లను ఎలా.. వెతుకుతారో తెలుసా?

సైన్స్‌కు సవాల్ విసురుతున్న పూరీ జగన్నాథ ఆలయ రహస్యాలు.. తెలిస్తే షాక్ అవుతారు!

Big Stories

Advertisement
×