E-Paper
Advertisement

Diwali Significance: 5 రోజుల దీపావళి పండగ ప్రాముఖ్యత.. దీని వెనక ఉన్న ఆసక్తికరమైన కథలను తెలుసుకోండి

Diwali Significance: 5 రోజుల దీపావళి పండగ ప్రాముఖ్యత.. దీని వెనక ఉన్న ఆసక్తికరమైన కథలను తెలుసుకోండి
Advertisement

Diwali Significance: దీపావళి భారతదేశంలోని అత్యంత ప్రసిద్ధ పండుగలలో ఒకటి. ఈ పండుగను 5 రోజుల పాటు జరుపుకుంటారు. ఈ పండగ కాంతి, శ్రేయస్సు, కుటుంబ సామరస్యానికి ప్రతీక. దీపాల పండుగగా పిలువబడే ఈ పండుగ ఐదు రోజుల పాటు అనేక ముఖ్యమైన ఆచారాలతో జరుపుకుంటారు. ఈ ఐదు రోజుల పండుగ సంపద, శ్రేయస్సును కలిగించే ధన త్రయోదశితో ప్రారంభమవుతుంది.

దీని తర్వాత ఛోటీ దీపావళి, దీపావళి, గోబర్ధన్, భాయ్-దూజ్ జరుపుకుంటారు. 5 రోజుల్లోని ప్రతి రోజు దాని స్వంత ప్రాముఖ్యతను కలిగి ఉంటుంది. కానీ చాలా మందికి ఈ పండుగల ప్రాముఖ్యత, వీటిని జరుపుకోవడానికి గల కారణాల గురించి తెలియదు. మీరు కూడా ఈ వ్యక్తులలో ఒకరైతే, ఈ పండుగల యొక్క ప్రాముఖ్యత, కథలను గురించి ఇప్పుడు తెలుసుకోండి.

Advertisement

ధనత్రయోదశి:
ధనత్రయోదశి దీపావళి మొదటి రోజు. ఇది కార్తీక కృష్ణ పక్షంలోని త్రయోదశి నుండి ప్రారంభమవుతుంది. ఈ రోజున, లక్ష్మీ దేవితో పాటు గణపతి, ఆయుర్వేదానికి మూలకర్త అయిన ధన్వంతరిని పూజిస్తారు. ఈ సందర్భంగా బంగారం, వెండి, వాహనాలను కొనుగోలు చేయడం శుభప్రదంగా భావిస్తారు. అందుకే ఈ రోజున చాలా మంది షాపింగ్ చేస్తారు.

నరక చతుర్దశి లేదా ఛోటీ దీపావళి:
నరక చతుర్దశిని రూప్ చౌదాస్ అని కూడా అంటారు. ఈ రోజు, చెడుపై మంచి గెలుపును సూచిస్తుంది. ఈ రోజున శ్రీ కృష్ణుడు భౌమాసురుడు అనే రాక్షసుడిని సంహరించి 16 వేల మంది మహిళలను అతని చెర నుండి విడిపించాడని చెబుతారు. ఈ విజయాన్ని జీవితంలో సమస్యలను అధిగమించడానికి గుర్తుగా జరుపుకుంటారు. అందుకే ఈ రోజున ప్రజలు తమ ఇళ్ల వద్ద దీపాలు వెలిగిస్తారు.

Advertisement

దీపావళి (లక్ష్మీ పూజ):
ఈ ఐదు రోజుల పండుగలో మూడవ రోజు అత్యంత ముఖ్యమైనది. ఈ ప్రధాన పండుగ అమావాస్య నాడు జరుపుకుంటారు. ఈ రోజున రాముడు రావణుడిని చంపిన తర్వాత అయోధ్యకు తిరిగి వచ్చాడు. సంపద, శ్రేయస్సు కోసం లక్ష్మిని పూజించిన రోజు కూడా.ఈ రోజున అందరూ పిండి వంటలు, స్వీట్లు తయారు చేసి అమ్మవారికి సమర్పిస్తారు. అంతే కాకుండా టపాసులు పేల్చుతారు.

Also Read: దీపావళి రోజు వీటిని లక్ష్మీ దేవికి సమర్పిస్తే.. జీవితాంతం డబ్బుకు లోటుండదు

గోవర్ధన పూజ:

దీపావళి మరుసటి రోజు గోవర్ధన పూజ, అన్నకూట్ ఉత్సవాన్ని జరుపుకుంటారు. ఇంద్రుని కోపం నుండి గ్రామస్తులను రక్షించడానికి శ్రీకృష్ణుడు గోవర్ధన పర్వతాన్ని ఎత్తిన రోజు ఇది. ఈ పండగను ప్రకృతి పట్ల గౌరవం, భూమి యొక్క సాగుకు ప్రతీకగా చెబుతారు. అందువల్ల, ఈ రోజున ప్రజలు గోవర్ధన పర్వతాన్ని పూజిస్తారు. స్వామికి యాభై ఆరు నైవేద్యాలు కూడా సమర్పిస్తారు.

భాయ్ దూజ్:
దీపావళి ఐదు రోజులలో చివరి రోజు భాయ్ దూజ్. ఈ రోజు అన్నదమ్ముల మధ్య బంధాన్ని ప్రతిబింబిస్తుంది. కుమార్తెలు తమ సోదరులకు దీర్ఘాయువు కావాలని కోరుకుంటారు. అంతే కాకుండా సోదరులు తమ సోదరీమణులకు బహుమతులు ఇస్తారు. ఇది కుటుంబంలో ప్రేమ, భద్రతను చూపుతుంది.

(గమనిక : ఇక్కడ ఇచ్చిన సమాచారం ఇంటర్నెట్ నుంచి సేకరించినది. bigtvlive.com దీనిని ధృవీకరించదు.)

Related News

తిరుమల శ్రీవారి తొలి దర్శనం.. వారికే ఎందుకు? దాని వెనుక కథేంటి?

పూరీ జగన్నాథుడి మహాప్రసాదం తయారీలో..ఆశ్చర్యకరమైన నిజాలు!

శుక్రవారం ఈ 5 పవిత్ర స్థలాల్లో దీపం పెడితే.. అష్టైశ్వర్యాలు మీ సొంతం

రుద్రాక్ష ధరిస్తున్నారా? ఈ తప్పులు చేస్తే.. నష్టాలు తప్పవు!

బ్రహ్మ ముహూర్తంలో కలలు వస్తున్నాయా? మీ జీవితం మారబోతుందనడానికి ఇదో సంకేతం!

జాతకంలో గ్రహ దోషాలు పోవాలా? ఈ వస్తువులు దానం చేస్తే తిరుగుండదు!

ఏ వేప చెట్టు పడితే అది వాడరు! పూరీ జగన్నాథుడి రథాల కోసం చెట్లను ఎలా.. వెతుకుతారో తెలుసా?

సైన్స్‌కు సవాల్ విసురుతున్న పూరీ జగన్నాథ ఆలయ రహస్యాలు.. తెలిస్తే షాక్ అవుతారు!

Big Stories

Advertisement
×