BigTV English

Pooja Room Rules : పూజ గది తలుపు మూసే ముందు ఆ పని అస్సలు చేయద్దు!

Pooja Room Rules : పూజ గది తలుపు మూసే ముందు ఆ పని అస్సలు చేయద్దు!

Pooja Room Rules : హిందువుల ఇళ్లల్లో ప్రతీ రోజు దీపారాదన చేస్తుంటాం. కొందరి ఇళ్లల్లో సౌలభ్యం మేరకు పూజకు గదికి తలుపులు కూడా ఏర్పాటు చేసుకుంటూ ఉంటారు. మరికొందరు కర్టెన్లు లాంటివి పెట్టుకుంటారు. పూజ చేసినప్పుడు తెరిచి మిగిలిన సమయాల్లో మూసేస్తుంటారు. మరి దీపాలు వెలుగుతున్నప్పుడు పూజ మందిరం తలుపులు మూసేయచ్చా అనే సందేహాలు చాలా మందికి వస్తుంటాయి. పూజ అయిన కాసేపటికే మందిరం తలుపులు మూసేయచ్చని పండితులు చెబుతున్నారు.


కానీ ఎప్పుడు పూజ అవుతుందా..ఎప్పుడు తలుపులు మూసేద్దామా అన్న ఆలోచనతో ఉండకూడదు. ఎదురుచూడకూడదు. పూజ చేసి హారతి ఇచ్చిన తర్వాత కృష్ణార్పణం అంటూ నమస్కరించి తీర్థ ప్రసాదాలు స్వీకరించాలి. ఆ పిమ్మట పూజ గది నుంచి బయటకు వచ్చేయాలి. హారతి కొండకి ఎక్కాలి. ఆ తర్వాత రెండు మూడు నిమిషాలు పూజ గది తలుపులు తెరిచే ఉంచాలి. హారతి కొండ ఎక్కినా..దీపాలు ప్రజల్విస్తూనే ఉంటాయి. అప్పుడు నెమ్మెదిగా తలుపులు మూయాలి .

దీపం వెలుగుతూ ఉన్నంతసేపు పూజ గది తలుపులు తెరిచి ఉంచాలనే నియమం ఎక్కడా లేదు.చాలామంది దీపం వెలుగుతూ ఉన్నంతసేపు తలుపులు తెరిచి ఉంచాలని ఉద్దేశపూర్వకంగానే దీపాన్ని కొండెక్కిస్తూ ఉంటారు.కానీ ఎప్పుడూ కూడా దీపాన్ని మనమే కొండెక్కించకూడదు.ఉద్దేశపూర్వకంగా దీపాన్ని కొండెక్కించడం వల్ల పరమ దరిద్రం కలుగుతుందని పెద్దలు చెబుతున్నారు


Tags

Related News

Raksha Bandhan 2025: 16 రోజుల పాటు రాఖీ తీయకూడదట ! హిందూ సాంప్రదాయం ఏం చెబుతోందంటే ?

Shravana Shukrawar 2025: శ్రావణ శుక్రవారం ఇలా చేస్తే.. అప్పుల బాధలు తొలగిపోతాయ్

Rakhi Festival 2025: రాఖీ పండగ రోజు.. ప్రతి ఒక్కరూ తప్పకుండా చేయాల్సిన పరిహారాలు ఇవే !

Koti Shivalingala Temple: కోటి శివలింగాలు ఒకే చోట చూడాలనుకుంటున్నారా? అయితే ఈ ఆలయానికి వెళ్లండి

Lakshmi Devi: మీ ఇంట్లో ఈ మూడు మొక్కలను ఎండకుండా చూసుకోండి, అలా ఎండితే లక్ష్మీదేవి కరుణించదు

Raksha Bandhan 2025: రాఖీ పళ్లెంలో.. ఈ వస్తువులు తప్పకుండా ఉండాలట !

Big Stories

×