E-Paper
Advertisement

Diwali 2025: లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలంటే.. పండగ రోజు దీపాలు ఎక్కడెక్కడ వెలిగించాలి ?

Diwali 2025: లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలంటే.. పండగ రోజు దీపాలు ఎక్కడెక్కడ వెలిగించాలి ?

Diwali 2025: దీపావళి హిందువులకు అత్యంత ముఖ్యమైన పండగ. ఈ వేడుక ధన త్రయోదశితో మొదలై భాయ్ దూజ్‌తో ముగుస్తుంది. ఈ సమయంలో దీపాలు వెలిగించడం శుభప్రదంగా భావిస్తారు. మత విశ్వాసం ప్రకారం.. దీపావళి నాడు దీపాలు వెలిగిస్తే లక్ష్మీ దేవి సంతోషిస్తుంది. కానీ దీపావళి రోజు డు దీపాలు ఎక్కడెక్కడ వెలిగించాలి, వాటి ప్రాముఖ్యతను గురించిన తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది.

దీపావళి పండగను కార్తీక మాసంలో వచ్చే అమావాస్య రోజున జరుపుకుంటారు. ఈ ప్రత్యేక రోజున లక్ష్మీదేవిని, గణపతిని పూజించడం ఆచారం. మత విశ్వాసం ప్రకారం.. లక్ష్మీదేవిని పూజిస్తే భక్తులు తమ జీవితంలో ఎప్పుడూ ఆర్థిక సమస్యలు ఎదుర్కోకుండా, ఆమె ఆశీర్వాదాలను పొందుతారు. ఈ రోజున దీపం వెలిగించడం కూడా చాలా పవిత్రంగా పరిగణిస్తారు. పండగ రోజు దీపాలు వెలిగిస్తే ఇంట్లోకి సానుకూల శక్తి వస్తుందని, అంతే కాకుండా ప్రతికూల శక్తి నశించిపోతుందని నమ్ముతారు. ఇది ఆనందం, శ్రేయస్సును కూడా పెంచుతుందని చెబుతారు. దీపావళి నాడు దీపాలు వెలిగించడం ద్వారా లక్ష్మీదేవి వచ్చే పవిత్ర ప్రదేశాలను జీవితంలో ఆనందం మరియు శాంతి నిలిచి ఉంటాయి.

తులసి దగ్గర దీపం:
దీపావళి రోజున తులసి మొక్క దగ్గర దీపం వెలిగించడం చాలా శుభప్రదంగా భావిస్తారు. తులసి మొక్క దగ్గర దీపం వెలిగిస్తే.. లక్ష్మీదేవి ప్రసన్నమై, జీవితంలో ఆనందం, శాంతి కలుగుతాయని నమ్ముతారు. అంతే కాకుండా డబ్బుకు కొరత ఉండదని చెబుతారు.

ఇంటి బయట దీపం:
ఇంటి ప్రాంగణంలో కూడా దీపం వెలిగించాలి. ఇలా చేయడం వల్ల ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయి.. జీవితంలో సంతోషం కలుగుతుంది.అంతే కాకుండా సానుకూల శక్తి కూడా ఇంట్లోకి ప్రవేశిస్తుంది.

Also Read: దీపావళి రోజు ఈ ఒక్కటి చేస్తే.. ఏడాదంతా సంపదకు లోటుండదు !

చెడు దృష్టి తొలగిపోతుంది:
దీపావళి రోజు.. పూజ గదిలో లక్ష్మీదేవి, వినాయకుడి విగ్రహాల ముందు దీపం వెలిగించండి. హారతి ఇచ్చిన తర్వాత మంత్రాలు జపించండి. ఆనందం, శ్రేయస్సు కోసం లక్ష్మీదేవిని ప్రార్థించండి. మత విశ్వాసం ప్రకారం.. లక్ష్మీదేవి ఆశీర్వాదంతో ఈ ఆచారం మీ సమస్యలను పూర్తి చేస్తుంది. అపారమైన సంపదను తెస్తుంది. ఇది మీ జీవితంలోకి కొత్త వెలుగును కూడా తీసుకొస్తుంది.

ఇంట్లోకి సానుకూల శక్తి ప్రవేశిస్తుంది:
దీపావళి నాడు మీ ఇంటి ప్రధాన ద్వారం వద్ద దీపం వెలిగించడం చాలా ముఖ్యం. మత విశ్వాసం ప్రకారం.. ఈ ఆచారం సంపద, శ్రేయస్సును పెంచుతుంది. అంతే కాకుండా మీ ఇంటికి సానుకూల శక్తిని తెస్తుంది.

ఆహార కొరత ఉండదు:
దీపావళి రోజు వంటగదిలో దీపం వెలిగించడం శుభప్రదంగా పరిగణిస్తారు. అలా చేయడం వల్ల అన్నపూర్ణ దేవి ఆశీస్సులు లభిస్తాయి.

Related News

రథాన్ని విరగ్గొట్టిన లక్ష్మీదేవి! పూరీ జగన్నాథ క్షేత్రంలో.. నేటికీ జరిగే అద్భుతమైన ఆచారం

చార్ ధామ్ యాత్ర.. ఎటు చూసినా భక్తులు, 8 కిలోమీటర్లు ట్రాఫిక్ జామ్

ఆ దేవుడికి చేతులు కాళ్ళు ఎందుకు ఉండవు ?..అసలు రహస్యం ఇదే

Black Thread: ఈ రాశుల వారు కాలికి నల్ల దారం కట్టుకుంటే శని చెడు ప్రభావం తగ్గుతుంది

Anger: కోపాన్ని తగ్గించే రత్నం.. సోమవారంనాడు ధరిస్తే మీ జీవితమే మారిపోతుంది

ప్రసాదంగా లడ్డూ కాదు.. సాక్షాత్తూ ‘డబ్బులే’ ఇస్తారు! ఈ వింత ఆలయం గురించి మీకు తెలుసా?

రావి చెట్టు ఇంట్లో ఉండకూడదని ఎందుకు అంటారు? అసలు నిజం తెలిస్తే షాక్ అవుతారు

Vastu tips: ఇలాంటి సీలింగ్ ఫ్యాన్ ఇంట్లోకి పేదరికాన్ని తెస్తుంది.. ఈ 5 తప్పులు చేయకండి

Big Stories

×