E-Paper
Advertisement

Parivartini Ekadashi 2024: పరివర్తిని ఏకాదశి రోజు ఇలా చేస్తే అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి

Parivartini Ekadashi 2024: పరివర్తిని ఏకాదశి  రోజు ఇలా చేస్తే అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి

Parivartini Ekadashi 2024: హిందూ మతంలో ఏకాదశి ఉపవాసం చాలా ముఖ్యమైనదిగా పరిగణించబడుతుంది. ఏకాదశి వ్రతం విష్ణుమూర్తికి అంకితం చేయబడింది. హిందూ క్యాలెండర్ ప్రకారం, ప్రతి నెల కృష్ణ పక్షం, శుక్ల పక్షం ఏకాదశి రోజున  విష్ణువును పూజించడంతో పాటు ఉపవాసం కూడా పాటిస్తారు. ప్రతి నెల శుక్ల పక్ష ఏకాదశి తిథి నాడు పరివర్తిని ఏకాదశి వ్రతం పాటిస్తారు. ఈ ఉపవాసం అన్ని ఉపవాసాల్లో  చాలా ముఖ్యమైనదిగా పరిగణించబడుతుంది. కాబట్టి ఈ నెలలో పరివర్తిని ఏకాదశి ఎప్పుడు, పవిత్రమైన తేదీ, ప్రాముఖ్యత గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

పరివర్తిని ఏకాదశి 2024 శుభ తేదీ, సమయం:

దృక్ పంచాంగ్ ప్రకారం.. భాద్రపద మాసంలోని శుక్ల పక్ష ఏకాదశి తేదీ సెప్టెంబర్ 13 శుక్రవారం ఉదయం 10.25 గంటలకు ప్రారంభమవుతుంది. అలాగే, ఈ తేదీ సెప్టెంబర్ 14 ఉదయం 8:45 గంటలకు ముగుస్తుంది. తిథి ప్రకారం, పరివర్తిని ఏకాదశి సెప్టెంబర్ 14, శనివారం జరుపుకోవాలి.

పరివర్తిని ఏకాదశి పూజా ముహూర్తం:

ఏకాదశి రోజు ఉపవాసం చేయడం చాలా మంచిది. ఈ రోజు ఉపవాసం పాటిస్తే విష్ణువు అనుగ్రహం ఉంటుందని చెబుతారు. మత విశ్వాసాల ప్రకారం, ఏకాదశి ఉపవాసం పాటించే వ్యక్తి తన జీవితంలో ఆనందం, శాంతి, శ్రేయస్సును పొందుతాడు. అలాగే ఈ రోజున దానధర్మాలు చేయడం వల్ల పుణ్యం లభిస్తుంది. ఏకాదశి రోజు దానధర్మాలు చేసే వారి పట్ల విష్ణువు కూడా సంతోషిస్తాడు. దీంతో వీరి జీవితంలో సానుకూల మార్పులు కూడా వస్తాయి. ఏకాదశి రోజు శుభ మూహుర్తంలో స్వామి వారిని పూజించాలి.

ఏకాదశి విశిష్టత:
ఒక సంవత్సరంలో 24 ఏకాదశి తిథిలు ఉన్నాయి. అవన్నీ విష్ణువుకు అంకితం చేయబడ్డాయి. ఈ రోజున జగద్గురువును ఆరాధించడం ద్వారా కోరుకున్న ఫలితాలు సిద్ధిస్తాయి. ఏకాదశి తిథి నాడు ఉపవాసం ఉండటం వల్ల మనిషికి సంపద పెరుగుతుంది. జీవితంలో ఆనందం కూడా లభిస్తుంది. ప్రతి నెలలో వచ్చే ఏకాదశి తిథికి ఓ ప్రత్యేకత ఉంటుంది. వీటిలో పరివర్తిని ఏకాదశి అత్యంత విశిష్టమైనదిగా పరిగణించబడుతుంది. పౌరాణిక విశ్వాసాల ప్రకారం, ఈ రోజున విష్ణువు నిద్రాసనంలో తన దిశను మార్చుకుంటాడు. అందుకే దీనికి పరివర్తిని ఏకాదశి అని పిలుస్తారు.

ఈ సంవత్సరం, పరివర్తిని ఏకాదశి వ్రతం 14 సెప్టెంబర్ 2024 న జరుపుకుంటారు. ఈ రోజున ఉత్తరాషాఢ నక్షత్రం శోభన యోగం కలసి వస్తుంది. అటువంటి పరిస్థితిలో, కొన్ని వస్తువులను దానం చేయడం అదృష్టం కలసివస్తుంది.

పసుపు రంగు పండ్లు:
విష్ణువు పసుపు రంగును ఎక్కువగా ఇష్టపడతాడు. పరివర్తిని ఏకాదశి నాడు పసుపు రంగు పండ్లను దానం చేయడం వల్ల శుభ ఫలితాలను కలుగుతాయి. దీంతో పాటు, ఆనందం, మీ శ్రేయస్సు జీవితంలో పెరుగుతాయి.

పప్పుధాన్యాల దానం:
పరివర్తిని ఏకాదశి రోజు పప్పుధాన్యాల దానం చేయాలి. పప్పుధాన్యాలను దానం చేయడం ద్వారా గురుదోషం నుండి ఉపశమనం పొందుతారని నమ్ముతారు. అలాగే జీవితంలో ఆనందం కూడా పెరుగుతుంది.

Also Read: శుక్రుడి సంచారం.. సెప్టెంబర్ 13 నుంచి వీరి జీవితం మారిపోనుంది

తీపి పదార్ధాలు దానం:
పరివర్తిని ఏకాదశి నాడు తెల్లని తీపి పదార్ధాలను దానం చేయండి. ఇలా చేయడం వల్ల మీ జీవితంలో మాధుర్యం పెరుగుతుంది. అంతే కాకుండా సంపదలకు దేవత అయిన లక్ష్మీదేవి కూడా సంతోషిస్తుంది.

వస్త్రదానం:
పరివర్తిని ఏకాదశి రోజు అవసరమైన వారికి వస్త్రదానం చేయాలి. ఇలా చేయడం వల్ల విష్ణువు ప్రసన్నుడై, మీరు కోరిన కోరికలన్నీ నెరవేరుతాయి. వస్త్రదానం చేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం జీవితంలో నిలిచి ఉంటుంది

ఆహార దానం:
మత విశ్వాసాల ప్రకారం, పేదవారికి అన్నదానం చేయడం వల్ల వ్యక్తి యొక్క సంపద పెరుగుతుంది. పరివర్తిని ఏకాదశి నాడు అన్నదానం చేయవచ్చు. ఇది ఇంట్లో ఆనందం, శ్రేయస్సును తెస్తుందని నమ్ముతారు.

(గమనిక : ఇక్కడ ఇచ్చిన సమాచారం ఇంటర్నెట్ నుంచి సేకరించినది. bigtvlive.com దీనిని ధృవీకరించదు.)

Related News

రథాన్ని విరగ్గొట్టిన లక్ష్మీదేవి! పూరీ జగన్నాథ క్షేత్రంలో.. నేటికీ జరిగే అద్భుతమైన ఆచారం

చార్ ధామ్ యాత్ర.. ఎటు చూసినా భక్తులు, 8 కిలోమీటర్లు ట్రాఫిక్ జామ్

ఆ దేవుడికి చేతులు కాళ్ళు ఎందుకు ఉండవు ?..అసలు రహస్యం ఇదే

Black Thread: ఈ రాశుల వారు కాలికి నల్ల దారం కట్టుకుంటే శని చెడు ప్రభావం తగ్గుతుంది

Anger: కోపాన్ని తగ్గించే రత్నం.. సోమవారంనాడు ధరిస్తే మీ జీవితమే మారిపోతుంది

ప్రసాదంగా లడ్డూ కాదు.. సాక్షాత్తూ ‘డబ్బులే’ ఇస్తారు! ఈ వింత ఆలయం గురించి మీకు తెలుసా?

రావి చెట్టు ఇంట్లో ఉండకూడదని ఎందుకు అంటారు? అసలు నిజం తెలిస్తే షాక్ అవుతారు

Vastu tips: ఇలాంటి సీలింగ్ ఫ్యాన్ ఇంట్లోకి పేదరికాన్ని తెస్తుంది.. ఈ 5 తప్పులు చేయకండి

Big Stories

×