E-Paper
Advertisement

Kartik Purnima 2024: కార్తీక పౌర్ణమి రోజు 365 వత్తులను ఎందుకు వెలిగిస్తారు ?

Kartik Purnima 2024: కార్తీక పౌర్ణమి రోజు 365 వత్తులను ఎందుకు వెలిగిస్తారు ?
Advertisement

Kartika Purnima 2024: హిందూ పూరాణాల ప్రకారం కార్తీక మాసానికి చాలా ప్రాముఖ్యత ఉంది. ఈ మాసంలో ప్రతీ రోజు ప్రముఖమైనదే. ఈ నెలలో చేసే పూజలు, వ్రతాలకు గొప్ప ఫలితం లభిస్తుందని చెబుతారు. ఇదిలా ఉంటే కార్తీక మాసంలో విశిష్టమైన రోజు కార్తీక పౌర్ణమి . కార్తీక పౌర్ణమిని నవంబర్ 15 న జరుపుకోనున్నాము.

కార్తీక పౌర్ణమి ప్రాముఖ్యత:

Advertisement

అత్యంత పవిత్రమైన కార్తీక మాసంలో భక్తులు పరమేశ్వరుడు, శ్రీ మహావిష్ణువుని పూజిస్తారు. అంతే కాకుండా వారి అనుగ్రహం కోసం దేవాలయాలను సందర్శించి దీపాలు కూడా వెలిగిస్తారు. కార్తీక మాసంలో ఉపవాసాలు ఉండి మాంసాహారానికి దూరంగా ఉంటారు. కార్తీక పౌర్ణమి రోజు ఉపవాసం ఉండి 365 వత్తులతో దీపం వెలిగిస్తారు. ఇలా చేస్తే దేవతలు సంతోషిస్తారని నమ్ముతారు. కార్తీక పౌర్ణమి తిథి నవంబర్ 15 వ తేదీ శుక్రవారం ఉదయం 6 గంటల 19 నిమిషాలకు ప్రారంభం అవుతుంది. మరుసటి రోజు నవంబర్ 16 న శనివారం మధ్యాహ్నం 2 గంటల 58 నిమిషాలకు పూర్తవుతుంది. ఉదయం తిథి ప్రకారం నవంబర్ 15 వ తేదీ శుక్రవారం నాడు కార్తీక పౌర్ణమిని జరుపుకోనున్నాము.

కార్తీక పౌర్ణమి రోజు శివాలయంలో 365 వత్తులను వెలిగిస్తే.. ముక్కోటి దేవతలను పూజించిన ఫలితం దక్కుతుందని నమ్ముతారు. ఈ పవిత్రమైన రోజు దీపాలు చూసిన వారి పాపాలు కూడా పటాపంచలు అవుతాయని చెబుతారు. నదీ తీరాల్లో దీపాలు వెలిగించే వారు అరటి దొప్పల్లో వెలిగించాలని అంటారు. ఇలాంటి అవకాశం లేని వారు తులసి చెట్టు దగ్గర అరటి దొప్పల్లో కూడా దీపం వెలిగించుకోవచ్చు. కార్తీక పౌర్ణమి రోజు దీపారాధన చేస్తే..సుఖ సౌఖ్యాలు లభించి జీవితానంతరం ముక్తి లభిస్తుందని  విశ్వసిస్తారు.

Advertisement

ఏడాది కాలంలో ఏ కారణం చేతనైనా దీపాలు వెలిగించని వారు కార్తీక పౌర్ణమి రోజు 365 దీపాలు వెలిగిస్తే మంచి ఫలితం ఉంటుంది. అందుకే చాలా మంది తప్పనిసరిగా కార్తీక పౌర్ణమి రోజు 365 దీపాలను వెలిగిస్తారు.

Also Read: కార్తీక పౌర్ణమి రోజు తప్పక పాటించాల్సిన నియమాలు ఇవే !

కార్తీక మాసంలో చాలా మంది ఉసిరి దీపం వెలిగిస్తూ ఉంటారు. కార్తీక పౌర్ణమి రోజు ఉదయం పూట నీటిలో ఉసిరి కాయలను వేసుకుని తలస్నానం చేసే పుణ్య ఫలం దక్కుతుందని నమ్ముతారు. ఉసిరి చెట్టును ఈశ్వర స్వరూపంగా భావిస్తారు. అందుకే ఈ మాసంలో ఉసిరి చెట్టును పూజిస్తారు. అంతే కాకుండా ఉసిరి చెట్టు క్రింద దీపాలను కూడా వెలిగిస్తారు. కార్తీక మాసంలో ఉసిరి దీపం వెలిగిస్తే లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయి. కార్తీక పౌర్ణమి రోజు ఉపవాసం ఉండి శివుడిని పూజించడం వల్ల కోరిన కోరికలు నెరవేరతాయి.

Related News

తిరుమల శ్రీవారి తొలి దర్శనం.. వారికే ఎందుకు? దాని వెనుక కథేంటి?

పూరీ జగన్నాథుడి మహాప్రసాదం తయారీలో..ఆశ్చర్యకరమైన నిజాలు!

శుక్రవారం ఈ 5 పవిత్ర స్థలాల్లో దీపం పెడితే.. అష్టైశ్వర్యాలు మీ సొంతం

రుద్రాక్ష ధరిస్తున్నారా? ఈ తప్పులు చేస్తే.. నష్టాలు తప్పవు!

బ్రహ్మ ముహూర్తంలో కలలు వస్తున్నాయా? మీ జీవితం మారబోతుందనడానికి ఇదో సంకేతం!

జాతకంలో గ్రహ దోషాలు పోవాలా? ఈ వస్తువులు దానం చేస్తే తిరుగుండదు!

ఏ వేప చెట్టు పడితే అది వాడరు! పూరీ జగన్నాథుడి రథాల కోసం చెట్లను ఎలా.. వెతుకుతారో తెలుసా?

సైన్స్‌కు సవాల్ విసురుతున్న పూరీ జగన్నాథ ఆలయ రహస్యాలు.. తెలిస్తే షాక్ అవుతారు!

Big Stories

Advertisement
×