BigTV English

Krishnashtami: శ్రీ కృష్ణుడికి ఛప్పన్ భోగ్ ఎందుకు సమర్పిస్తారు ? కొన్ని ఆసక్తికర విషయాలు

Krishnashtami: శ్రీ కృష్ణుడికి ఛప్పన్ భోగ్ ఎందుకు సమర్పిస్తారు ? కొన్ని ఆసక్తికర విషయాలు

krishnashtami 2024: సనాతన ధర్మం ప్రకారం శ్రీకృష్ణ జన్మాష్టమికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. హిందూ శాస్త్రాల్లో నాలుగు రాత్రులకు ప్రత్యేక స్థానముంది. శివరాత్రిని మహా శివరాత్రి అని, దీపావళి కాళరాత్రి అని, హోలీని అహోరాత్రని, కృష్ణ జన్మాష్టమి మోహరాత్రి అని చెబుతుంటారు. శ్రీకృష్ణ జన్మాష్టమికి సంబంధించి అనేక కథలు ప్రాచుర్యంలో ఉన్నాయి. శ్రీకృష్ణ భగవానుడు మంత్రముగ్ధమైన అవతారంతో జన్మించాడు.


భాద్రపద మాసం, కృష్ణ పక్షంలో అష్టమి తిథినాడు శ్రీకృష్ణుడు జన్మ దినం జరుపుకుంటారు. ఈ ప్రత్యేకమైన రోజు రోహిణి నక్షత్రంలో శ్రీకృష్ణుడిని పూజించడం ద్వారా విశేష ప్రయోజనాలు పొందుతారు. శ్రీ కృష్ణ జన్మాష్టమి ఆగస్ట్ 26 2024 న జరుపుకోనున్నాం. ఈ రోజున కృష్ణుడికి ఛప్పన్ భోగ్ సమర్పిస్తారు. కొన్ని రకాల ఉపవాసాలను కూడా పాటిస్తారు .

శ్రీకృష్ణుడికి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తారు. జన్మాష్టమి రోజున శ్రీకృష్ణుడికి 56 రకాల వంటలను నైవేద్యంగా పెడుతుంటారు. ఛప్పన్ భోగ్ శ్రీ కృష్ణుడికి ఎందుకు సమర్పిస్తారు. దీని వెనుక ఉన్న రహస్యం ఏంటి అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.


ఛప్పన్ భోగ్ :
ఒకసారి గోకులంలోని గోపికలు శ్రీకృష్ణుడిని భర్తగా పొందాలని ఒక నెల పాటు నిరంతరంగా యమునా నదిలో స్నానం చేసి కాత్యాయనీ మాతను పూజించారు. ఆ తర్వాత శ్రీ కృష్ణుడిని భర్తగా పొందారు. శ్రీకృష్ణుడికి ఈ విషయం తెలియగానే శ్రీకృష్ణుడు గోపికల అందరికీ వారి కోరికలు తీరుస్తానని హామీ ఇచ్చాడు. దీంతో సంతోషించిన గోపికలు శ్రీకృష్ణుడికి 56 రకాల వంటకాలను సిద్ధం చేశారు.

Also Read: సనాతన ధర్మం ప్రకారం వివాహాలు ఎన్ని రకాలో తెలుసా ?

కథ:

తల్లి యశోద తన బిడ్డ గోపాలుడికి ప్రతి రోజు ఎనిమిది సార్లు తినిపించేదని చెబుతుంటారు. అయితే శ్రీకృష్ణుడు గోవర్ధన పూజ చేసినప్పుడు దేవరాజు ఇంద్రుడు బ్రిజ్ నివాసితులపై కోపం తెచ్చుకున్నాడు. కోపంలో బ్రిజ్ ప్రజలకు క్షమాపణ చెప్పవలసి వచ్చింది. కానీ బ్రిజ్ ప్రజలను రక్షించడానికి శ్రీకృష్ణుడు గోవర్ధన పర్వతాన్ని తన వేలుతో ఎత్తాడు. ప్రజలందరినీ ఆ పర్వతం కిందకు రమ్మని చెప్పాడు. శ్రీకృష్ణుడు గోవర్ధన పర్వతాన్ని ఏడు రోజుల పాటు తినకుండా తాడకుండా ఎత్తాడు. ఇంద్రుడు తన తప్పు తెలుసుకున్నప్పుడు అతను స్వయంగా సమాధానాలు కోరాడు. ఏడో రోజు వర్షం ఆగినప్పుడు తల్లి యశోద బ్రిజ్ ప్రజలతో కలిసి ఏడు రోజుల్లో ఎనిమిది గంటల ప్రకారం కన్నయ్యకు 56 నైవేద్యాలను సిద్ధం చేసింది. అప్పటి నుంచి శ్రీకృష్ణుడికి 56 వంటకాలు శ్రీ కృష్ణాష్టమికి సమర్పిస్తారు.

(గమనిక : ఇక్కడ ఇచ్చిన సమాచారం ఇంటర్నెట్ నుంచి సేకరించినది. bigtvlive.com దీనిని ధృవీకరించదు.)

Related News

Navratri Day-2: నవరాత్రి రెండో రోజు.. అమ్మవారిని ఎలా పూజించాలి ?

Navaratri 2025: నవరాత్రుల సమయంలో.. ఇలా చేస్తే పట్టిందల్లా బంగారమే !

Bathukamma 2025: మూడో రోజు బతుకమ్మ.. ముద్దపప్పు నైవేద్యంగా పెట్టడం వెనక ఇంత కథ ఉందా ?

Bathukamma Festival 2025: 9 రోజుల బతుకమ్మ.. ఏ రోజు ఏ నైవేద్యం పెడతారు ?

Yaksha questions: యక్ష ప్రశ్నలు అంటే ఏమిటి? ఎందుకు అంత ప్రాధాన్యం

Engili Pula Bathukamma: ఎంగిలి పూల బతుకమ్మ.. సమర్పించే నైవేద్యం, ప్రత్యేకత ఏంటో తెలుసా ?

Bathukamma 2025: ఎంగిలి పూల బతుకమ్మ.. ఇంతకీ ఈ పేరు ఎలా వచ్చిందో తెలుసా ?

Amavasya 2025: ఆదివారం అమావాస్య.. సాయంత్రం లోపు ఇలా చేయకుంటే అష్టకష్టాలు

Big Stories

×