Ram Charan: దేశంలోనే మొట్టమొదటిసారి హైదరాబాద్లో ఫార్ములా-ఈ ప్రపంచ ఛాంపియన్ షిప్ జరగనుంది. శనివారం ఈ రేసింగ్ ప్రారంభం కానుంది. ఈ సందర్భంగా హైటెక్ సిటీలోని టెక్ మహీంద్రా ఇన్ఫో సిటీ క్యాంపస్లో మహీంద్రా ఈ రేసింగ్ జనరేషన్ త్రీ కారు ప్రదర్శన నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రి కేటీఆర్, సినీనటుడు రామ్చరణ్, వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆనంద్ మహీంద్రా, ఆ కంపెనీ సీఈఓ, ఎండీ సి.పి. గుర్నానీ, మంత్రి కేటీఆర్లతో దిగిన ఫొటోలను రామ్చరణ్ సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. సంతోషాన్ని వ్యక్తం చేశాడు. ఈ రేసింగ్తో ప్రపంచమంతా హైదరాబాద్ చుట్టే చూస్తుందని అన్నారు. అలాగే ఫార్ములా ఈ రేసింగ్ సక్సెస్ అవ్వాలని ఆకాంక్షిస్తూ.. ఈ రేసింగ్ను హైదరాబాద్కు తీసుకొచ్చిన మంత్రి కేటీఆర్కు ధన్యవాదాలు తెలిపారు.