E-Paper
Advertisement

BJP MLA on Allu Arjun: టికెట్ ధర పెంపు పై బీజేపీ ఎమ్మెల్యే ఫైర్.. బన్నీని బండబూతులు తిడుతూ పోస్ట్..!

BJP MLA on Allu Arjun: టికెట్ ధర పెంపు పై బీజేపీ ఎమ్మెల్యే ఫైర్.. బన్నీని బండబూతులు తిడుతూ పోస్ట్..!
Advertisement

BJP MLA on Allu Arjun.. అల్లు అర్జున్ (Allu Arjun), సుకుమార్(Sukumar) కాంబినేషన్ లో వచ్చిన పాన్ ఇండియా చిత్రం ‘పుష్ప2’. రేపు అనగా డిసెంబర్ 5వ తేదీన చాలా గ్రాండ్ గా ఈ సినిమా విడుదల కాబోతోంది. అంతేకాదు ఈరోజు రాత్రికే ప్రీమియర్ షోలు పడనున్నాయి. అయితే సినిమా విడుదల కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తుండగా.. టికెట్ ధరల పెంపు మాత్రం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ముఖ్యంగా సామాన్యుడు మొదటి ఐదు రోజుల వరకు సినిమాను చూసే అవకాశం లేకుండా చేశారు ‘మైత్రి మూవీ మేకర్స్’.

బెనిఫిట్ షోలతోనే లాభం..

Advertisement

ముఖ్యంగా ఒక్కో సినిమా టిక్కెట్ పై 800 రూపాయలు అదనంగా ప్రకటించడంతో సామాన్యులు సినిమాను చూడలేకపోతున్నారు. ముఖ్యంగా ప్రతి అభిమాని కూడా కూడా తమ అభిమాన హీరో సినిమాలు మొదటి షో, మొదటి రోజే చూడాలని కలలు కంటారు. కానీ ఇలాంటి ధరలు చూసిన తర్వాత వెనకడుగు వేస్తున్నారని చెప్పవచ్చు. దీనిపై పలువురు సీనియర్ జర్నలిస్టులు కూడా సామాన్యులను, వారి కష్టాలను దృష్టిలో పెట్టుకొని ఏకంగా కోర్టులో కేసు కూడా వేసిన విషయం తెలిసిందే. ఏది ఏమైనా బెనిఫిట్ షో లతోనే లాభం మొత్తం పొందేయాలని చూస్తున్నారు మైత్రి మూవీ మేకర్స్.

పుష్ప లో చూపించిందంతా అబద్ధం..

Advertisement

ఇదిలా ఉండగా తాజాగా ఈ సినిమా టిక్కెట్ ధరల పెంపుపై మండిపడుతూ అల్లు అర్జున్ ను బండబూతులు తిడుతున్నారు బీజేపీ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి (Rakesh Reddy. ఆర్మూర్ బీజేపీ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి పుష్ప -2 సినిమాను విడుదల చెయ్యొద్దు అంటూ బాంబ్ పేల్చారు. పుష్ప సినిమాలో చూపించిందంతా అబద్ధం. ఎర్రచందనం రూ.10 లక్షలు ఉంటే అక్కడ రూ .కోటి లాగా చూపించారు. దీంతో యువకులు లక్షలాది చెట్లను కూడా నరికేశారు. ఇప్పుడు పుష్ప 2 విడుదల అయితే ఇంకెన్ని చెట్లు నరికేస్తారో అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక సినిమా యువతకు మంచి నేర్పించాలి కాని ఈ సినిమా యువతను పాడు చేస్తోంది.

అల్లు అర్జున్, సుకుమార్ లను అరెస్టు చేయాలి..

అందుకే హీరో అల్లు అర్జున్, డైరెక్టర్ సుకుమార్ ను అరెస్టు చేసి జైల్లో వేయాలి. అసలు ఈ సినిమాను రిలీజ్ చేయొద్దు అంటూ డిమాండ్ చేశారు రాకేష్ రెడ్డి.అలాగే టికెట్ ధరల పెంపుపై మాట్లాడుతూ.. అసలు అల్లు అర్జున్ కి ఏం తక్కువయింది. వేలకోట్ల ఆస్తులున్నాయి. కానీ రూ.2000, రూ.3000, రూ .5000 అంటే ఎక్కడి నుంచి సామాన్య ప్రజలు తీసుకొచ్చి సినిమా చూస్తారు. అంత డబ్బు ఉండి కూడా ఎందుకు ఇలా రేట్లు పెంచి ప్రజలను ఇబ్బంది పెడతారు అంటూ మండి పడ్డారు. ముఖ్యంగా అల్లు అర్జున్, సుకుమార్ లను రైతుల దగ్గరకు తీసుకెళ్లి వారి దగ్గర ఎర్రచందనం ధరలు ఎలా ఉన్నాయో వీరికి ముందు చూపించాలి. ఇక పుష్ప 2 విడుదల అయితే మాత్రం ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కి ఎంత తలనొప్పి ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఒకప్పుడు 10 మందిని చంపేవారు. ఇప్పుడు 1000 మందిని చంపుతారు.ఇలాంటి సినిమాలు తీస్తున్న వారిని ఊరికే వదిలిపెట్టకూడదు అంటూ మండిపడ్డారు.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×