E-Paper
Advertisement

Ekta Kapoor: ఏక్తా కపూర్ పై పోక్సో కేసు, బాలీవుడ్ నిర్మాతకు చిక్కులు తప్పవా?

Ekta Kapoor: ఏక్తా కపూర్ పై పోక్సో కేసు, బాలీవుడ్ నిర్మాతకు చిక్కులు తప్పవా?
Advertisement

Pocso Case On Ekta Kapoor: ప్రముఖ బాలీవుడ్ నిర్మాత ఏక్తా కపూర్‌  మెడకు పోక్సో కేసు ఉచ్చు చిక్కుకుంది. ఆల్ట్‌ బాలాజీ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న‘గంధీ బాత్‌’ వెబ్‌ సిరీస్‌ లో అమ్మాయిలను అసభ్యంగా చూపించారనే ఫిర్యాదుపై ముంబై పోలీసులు కేసు నమోదు చేశారు. ఏక్తా కపూర్ తో పాటు ఆమె తల్లి శోభా కపూర్ పేరును కూడా ఈ కేసులో చేర్చారు.

ఇంతకీ అసలు ఏం జరిగిందంటే?

Advertisement

ఏక్తా కపూర్, ఆమె తల్లి శోభా కపూర్ గతంలో ‘గంధీ బాత్’ అనే వెబ్ సిరీస్ ను నిర్మించారు. ఈ వెబ్ సిరీస్ మొత్తం 7 సీజన్లుగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆల్ట్‌ బాలాజీ ఓటీటీ వేదిగా స్ట్రీమింగ్ అయ్యింది. తాజాగా ముంబైకి చెందిన ఓ వ్యక్తి ఎంహెచ్‌బీ పోలీస్‌ స్టేషన్‌ లో ఏక్తా కపూర్, ఆమె తల్లి శోభా కపూర్ మీద ఫిర్యాదు చేశాడు. ‘గంధీ బాత్’ వెబ్ సిరీస్ లోని 6వ సీజన్ లో బాలికలను అశ్లీలంగా చూపించాని ఫిర్యాదులో పేర్కొన్నాడు. సమాజంలో గొప్ప వ్యక్తులగా పేరు తెచ్చుకున్న వారితో పాటు సాధువులను అవమానించేలా ఈ సిరీస్ లో సన్నివేశాలు ఉన్నాయని వెల్లడించారు. ఈ వెబ్ సిరీస్ తో సాధువుల మనోభావాలు దెబ్బతిన్నాయన్నారు. పోక్సో చట్టానికి సంబంధించి నిబంధనలు ఉల్లంఘించేలా ఈ సిరీస్ ను రూపొందించాని వెల్లడించారు. వెంటనే చిత్ర నిర్మాతలపై తగిన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో కోరారు. ‘గంధీ బాత్’ వెబ్ సిరీస్ పై ఫిర్యాదు వచ్చిన నేపథ్యంలో నిర్మాతలు ఏక్తా కపూర్, ఆమె తల్లి శోభా కపూర్ పై పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు.

మూడేళ్ల క్రితం ప్రసారమైన సిరీస్ పై ఇప్పుడు కేసు

Advertisement

వాస్తవానికి ‘గంధీ బాత్’ వెబ్ సిరీస్ మూడు సంవత్సరాల క్రితం ప్రసారం అయ్యింది. 2021 ఫిబ్రవరి-ఏప్రిల్‌ మధ్య ఆల్ట్‌ బాలాజీలో స్ట్రీమింగ్ అయ్యింది. ఇందులో మైనర్‌ బాలికలను అభ్యంతరకర సన్నివేశాల్లో చూపించే సన్నివేశాలు ఉన్నాయంటూ అప్పట్లో తీవ్ర దుమారం చెలరేగింది. ఈ వెబ్ సిరీస్ పై పలువురు అభ్యంతరం తెలిపారు. ప్రజల నుంచి వచ్చిన నిరసనల నేపథ్యంలో 6వ సీజన్ లోని వివాదాస్పద ఎపిసోడ్ ను ఓటీటీ నుంచి డిలీట్ చేశారు. ప్రస్తుతం ఈ సిరీస్ స్ట్రీమింగ్ కాకపోయినా, చట్టపరంగా తప్పుడు చర్య కావడంతో పోలీసులు విచారణ ప్రారంభించారు. మరోవైపు మూడేళ్ల కిందట రిలీజ్ అయిన ఈ సిరీస్ పై ఇప్పుడు కేసు పెట్టడం వెనుక దురుద్దేశం ఏమైనా ఉండొచ్చని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

పోక్సో చట్టం ఏం చెప్తోంది?

బాలికలపై లైంగిక దాడులు పెరుగుతున్న నేపథ్యంలో దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు సెప్టెంబర్ లో కీలక తీర్పు వెల్లడించింది. చిన్న పిల్లలకు సంబంధించిన అశ్లీల వీడియోలు చూసినా, డౌన్ లోడ్ చేసినా నేరమేనని వెల్లడించింది. మరోవైపు 12 సంవత్సరాల లోపు వయసున్న బాలికలపై లైంగిక నేరాలకు పాల్పడ్డ దోషులకు కఠిన శిక్షలు అమలు చేసేందుకు 2012లో కేంద్ర ప్రభుత్వం పోక్సో యాక్ట్ ను తీసుకొచ్చింది. చిన్నారులపై అత్యాచారానికి పాల్పడ్డ దోషులకు ఉరిశిక్ష విధించే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం ఈ చట్టం ప్రకారం కేసు నమోదు కావడంతో ఏక్తా కపూర్ కు తిప్పలు తప్పేలా కనిపించడం లేదు.

Read Also: రూ. 250 కోట్లతో ఇల్లు కడుతున్న ఆలియా, మరీ అంత చెత్తగా ఉందేంటని ట్రోల్స్!

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×