Manjusha: యాంకర్ మంజూష గురించి తెలుగువారికి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. 2005 లో ఆమె యాంకర్ గా కెరీర్ ను మొదలుపెట్టింది. అప్పట్లో జెమిని టీవీలో వచ్చే 24 ఫ్రేమ్స్ షోకు యాంకర్ గా చేసి పేరు తెచ్చుకుంది. ఇక ఈ షోనే కాకుండా మీరు నేను ఓ పాట, స్టైల్ స్టైల్ రా, ఫ్లాష్ బ్యాక్ లాంటి షో చేసి మెప్పించింది.
ఇక ఆ సమయంలోనే మంజూషకు రాఖీ సినిమా ఆఫర్ వచ్చింది. ఎన్టీఆర్, ఇలియానా, ఛార్మి హీరో హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాకు కృష్ణవంశీ దర్శకత్వం వహించాడు. అన్నా చెల్లెళ్ళ అనుబంధం ఎలాంటిదో ఈ సినిమా ద్వారా కృష్ణవంశీ చూపించాడు. ఇందులో ఎన్టీఆర్ కు చెల్లిగా మంజూష నటించింది. ఈ సినిమా ఆమెకు మంచి పేరు తీసుకొచ్చి పెట్టింది. ఎక్కడికి వెళ్లిన ఆమెను రాఖీ చెల్లి అని పిలవడం మొదలుపెట్టారు.
2006 లో రిలీజ్ అయిన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. ఈ సినిమా తరువాత మంజూష మరో సినిమాలో నటించింది లేదు. యాంకర్ గానే కొనసాగుతూ వచ్చింది. అయితే ఇప్పుడున్న మంజూష చాలా మారింది. ఆ సినిమా సమయంలో కొంచెం సన్నగా.. డీ గ్లామర్ గా కనిపించింది. కానీ, ఇప్పుడు మంజూష హాట్ బ్యూటీగా మారింది. నిత్యం ఆమె సోషల్ మీడియాలో హాట్ హాట్ ఫొటోస్ తో అదరగొడుతూ ఉంటుంది.
రాఖీ సినిమా అప్పుడు కనుక ఈ హాట్ బ్యూటీ ఇలా కనిపిస్తే కచ్చితంగా హీరోయిన్ అయ్యేదని అభిమానులు చెప్పుకొస్తున్నారు. ప్రస్తుతం మంజూష ప్రీ రిలీజ్ ఈవెంట్స్, ఇంటర్వూస్ చేస్తూ బిజీగా మారింది. సుమ తరువాత ఏదైనా స్టార్ హీరోల ఈవెంట్ చేయాలంటే మంజూషనే బెస్ట్ ఛాయిస్. మరి ముందు ముందు మంజూష సినిమాల్లో మళ్లీ కనిపిస్తుందేమో చూడాలి.