Big Stories

Gangs of Godavari Postponed: మళ్లీ వెనక్కి వెళ్లిన లంకల రత్న.. ఆ సెంటిమెంట్ కోసమా..?

Gangs Of Godavari Postponed again: మాస్ కా దాస్ విశ్వక్ సేన్, నేహా శెట్టి జంటగా కృష్ణ చైతన్య దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి. సితార ఎంటర్ టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ బ్యానర్స్ పై సాయి సౌజన్య మరియు సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. ఇక ఈ చిత్రంలో అంజలి కీలక పాత్రలో నటిస్తుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్ , సాంగ్స్, ట్రైలర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.

- Advertisement -

మే 17 న ఈ సినిమా రిలీజ్ కానుందని ప్రమోషన్స్ కూడా మొదలుపెట్టారు. సినిమా రిలీజ్ కు ఇంకా వారం ఉందన్న సమయంలో గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి వాయిదా పడిందని మేకర్స్ అధికారికంగా తెలిపారు. అసలు చెప్పాలంటే ఈపాటికే ఈ సినిమా రిలీజ్ అయ్యిపోయి ఉండాలి. కొన్ని కారణాల వలన మే 17 కు వాయిదా పడింది. ఇప్పుడు రిలీజ్ అవుతుంది అనుకొనేలోపు మే 31 న వస్తుందని తెలిపారు. అయితే ఎందుకు వాయిదా పడింది అనేది మాత్రం చెప్పలేదు. అయితే ఆరోజు సెంటిమెంట్ వర్క్ అవుట్ అవుతుందని మేకర్స్ తెలిపారు.

- Advertisement -

5 ఏళ్ళ క్రితం అదే రోజున విశ్వక్ నటించి, దర్శకత్వం వహించిన ఫలక్ నామా దాస్ రిలీజ్ అయ్యింది. ఈ సినిమా అతని కెరీర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఇప్పుడు అదే డేట్ న గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి తో మళ్లీ విశ్వక్ వస్తున్నాడు. ఆ సెంటిమెంట్ కలిసి వస్తుందని మేకర్స్ చెప్పుకొచ్చారు. ఇకపోతే మే 31 న ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 5 సినిమాలతో పోటీ పడాల్సి ఉంది. సుధీర్ బాబు హరోంహర, కార్తికేయ భజే వాయువేగం, కాజల్ సత్యభామ, ఆనంద్ దేవరకొండ గం..గం.. గణేశా..తో పాటు మ్యూజిక్ షాప్ మూర్తి సినిమా కూడా రిలీజ్ అవుతున్నాయి. మరి ఈ సినిమాలతో పోటీపడి లంకల రత్న ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.

Also Read: OMG Movie Teaser: భయపెట్టడానికి హీరోయిన్ తో కలిసివస్తున్న స్టార్ కమెడియన్..

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News