Big Stories

Jai Hanuman: ‘జై హనుమాన్’లో చిరంజీవి, మహేశ్ బాబు.. దర్శకుడి ప్లాన్ మామూలుగా లేదు..!

Jai Hanuman: ఎవరూ ఊహించని కొన్ని చిన్న సినిమాలు.. అద్భుతమైన ఘన విజయాన్ని అందుకుని అందరినీ ఆశ్చర్యపరుస్తుంటాయి. అందులో ‘హనుమాన్’ మూవీ ముందు వరుసలో ఉంటుంది. క్రియేటివ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన ఈ మూవీలో యంగ్ నటుడు తేజా సజ్జ హీరోగా నటించాడు. సంక్రాంతి సందర్భంగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా సంచలన విజయాన్ని కైవసం చేసుకుంది.

- Advertisement -

బాక్సాఫీసు వద్ద దాదాపు రూ.250 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టి అదరగొట్టింది. అయితే ఇప్పటికీ ఈ సినిమా థియేటర్లలో రన్ అవుతూ దూసుకుపోతోంది. ఈ సినిమాతో అటు దర్శకుడు ప్రశాంత్ వర్మకు, ఇటు హీరో తేజా సజ్జకు మంచి పేరు వచ్చింది. ఈ మూవీ ఘన విజయంతో దర్శకుడు ప్రశాంత్ వర్మ ఇటీవల సీక్వెల్‌ను ప్రకటించాడు. ఈ సీక్వెల్ మూవీకి ‘జై హనుమాన్’ అనే టైటిల్‌ను ఖరారు చేశాడు.

- Advertisement -

ఇందులో శ్రీరాముడు, ఆంజనేయుడి పాత్రలు ప్రధానంగా ఉండనున్నాయి. అయితే ఈ పాత్రలలో స్టార్ హీరోలు నటిస్తారని ప్రశాంత్ వర్మ ఇటీవల తెలిపాడు. దీంతో రాముడు, ఆంజనేయుడి పాత్రలలో ఎవరు నటిస్తారోనన్న ఉత్కంఠ అందరిలోనూ ఉంది. ఈ నేపథ్యంలో ఆ పాత్రలకు ఏ హీరో అయితే బాగుంటుందని తాను అనుకున్నారో దర్శకుడు ప్రశాంత్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో తెలిపాడు.

‘‘జై హనుమాన్ మూవీలో హనుమాన్ పాత్ర కోసం బాలీవుడ్ నటులు రెడీగా ఉన్నారు. అయితే ఆ పాత్ర చూడగానే భక్తితో నమస్కారం చేయాలన్న ఫీలింగ్ వారిలో కలగాలి.. ఆ జాబితాలో మెగాస్టార్ చిరంజీవి కూడా ఉండవచ్చు. ఇక అన్నీ కుదిరితే చిరంజీవి ఆ పాత్ర చేసే అవకాశముంది. పద్మ విభూషణ్ తర్వాత ఆయన బిజీ అయిపోయారు. అందువల్ల ఆయనకు వీలు అయినపుడు వెళ్లి కలుస్తాను. అలాగే రాముడిగా నా మనసులో ఉన్న నటుడు మహేశ్ బాబు. ఈ క్యారెక్టర్‌ని మహేశ్ బాబుతో చేస్తే బాగుంటుందని నాకు అనిపిస్తోంది. ఆయన రాముడిగా ఎలా ఉంటారో గ్రాఫిక్స్‌లో చూశాము.’’ అంటూ ప్రశాంత్ చెప్పుకొచ్చాడు. దీని బట్టి చూస్తే జై హనుమాన్ మూవీకి వీరిద్దరినీ తీసుకునే అవకాశాలు ఉన్నాయని వార్తలు వినిపిస్తున్నాయి.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News