Big Stories

Janhvi Kapoor : వామ్మో ఖరీదైన ఇల్లు సొంతం చేసుకున్న జాన్వీ కపూర్.. ధర తెలిస్తే షాకే!

Janhvi Kapoor : దివంగత స్టార్ నటి శ్రీదేవి ముద్దుల తనయ జాన్వీ కపూర్ ఇప్పుడు వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. తండ్రీ తల్లి సంపాదించిన ఆస్తులున్నప్పటికీ జాన్వీ కపూర్ తన సంపాదనతో రీసెంట్‌గా ఖరీదైన ఇంటిని సొంతం చేసుకుంది. ఇప్పటికే రాజ్ కుమార్ రావు జుహులోని ఇంటిని రూ.45 కోట్లకు సొంతం చేసుకున్న జాన్వీ కపూర్.. ఇప్పుడు మరో ఖరీదైన డూప్లెక్స్ ఇంటిని సొంతం చేసుకుందట. ఈ ఇల్లు ముంబైలోని బాంద్రాలో ఉంది. దీని కోసం ఈ అమ్మడు ఏకంగా రూ.65 కోట్లు ఖర్చు పెట్టింది. స్టాంప్ డ్యూటీ కింద రూ.3.90 కోట్ల రూపాయలను చెల్లించిందని సమాచారం. సంపాదిస్తున్న డబ్బుని సినిమాల్లో కాకుండా రియల్ ఎస్టేట్‌లో జాన్వీ ఇన్వెస్ట్ చేస్తుందని తెలుస్తోంది.

- Advertisement -

ఈ శుక్రవారం మిలి చిత్రంతో సందడి చేసిన జాన్వీ కపూర్ సౌత్‌లో సినిమా చేయటానికి ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తుందట. ఈ విషయాన్ని ఆమె రీసెంట్ ఇంటర్వ్యూలో తెలియజేసింది.ముఖ్యంగా టాలీవుడ్‌లో అయితే ఎన్టీఆర్‌తో కలిసి నటించాలనుకుంటుందట జాన్వీ కపూర్. ముద్దుగుమ్మ ఈ విషయాన్ని చెప్పిందో లేదో.. త్వరలోనే ప్రారంభం కాబోతున్న NTR 30లో జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తుందనే వార్తలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. మరి ఇందులో నిజా నిజాలేంటో తెలియాలంటే కొన్నాళ్లు ఆగాల్సిందే.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News