BigTV English

Kanguva : “కంగువ” ఆడియో లాంచ్ కు గెస్ట్ గా పాన్ ఇండియా స్టార్

Kanguva  : “కంగువ” ఆడియో లాంచ్ కు గెస్ట్ గా పాన్ ఇండియా స్టార్

Kanguva : కోలీవుడ్ స్టార్ హీరో సూర్య నటించిన పీరియాడిక్ యాక్షన్ డ్రామా ‘కంగువ’. శివ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా రిలీజ్ గురించి ఆయన అభిమానులు ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు. సూర్య కెరీర్ లో 42వ ప్రాజెక్ట్ గా వస్తున్న ఈ మూవీలో బాలీవుడ్ హీరోయిన్ దిశా పటాని ఫిమేల్ లీడ్ రోల్ పోషిస్తున్న విషయం తెలిసిందే. బాబి డియోల్ ఇందులో విలన్ గా నటిస్తున్నాడు. ఇక మూవీ రిలీజ్ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న సూర్య అభిమానులు ఎగిరి గెంతేసే వార్త ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ సినిమా ఆడియో లాంచ్ కి ఒక పాన్ ఇండియా స్టార్ గెస్ట్ గా రాబోతున్నారంటూ ప్రచారం జరుగుతుంది. మరి ఆ స్టార్ హీరో ఎవరో తెలుసుకుందాం పదండి.


ఆడియో లాంచ్ కి గెస్ట్ గా ఇద్దరు స్టార్స్

నవంబర్ 14న ‘కంగువ’ సినిమా తెలుగు, తమిళ భాషల్లోనే కాకుండా పాన్ ఇండియా రేంజ్ లో భారీ ఎత్తున రిలీజ్ కాబోతోంది. ఇక రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న తరుణంలో మేకర్స్ సినిమా ప్రమోషన్ ఈవెంట్స్ లో జోరు పెంచబోతున్నారు. ఈ నేపథ్యంలోనే ‘కంగువ’ మూవీ ఆడియో లాంచ్ ను తెలుగు, తమిళ భాషలో గ్రాండ్ గా నిర్వహించబోతున్నారని, ఇప్పటికే మేకర్స్ అతిథులను సైతం ఫైనల్ చేశారని టాక్ నడుస్తోంది. రెండు భాషల్లోనూ ఒక్కో స్టార్ ను ఈవెంట్ కు గెస్ట్ గా ఆహ్వానించబోతున్నారని తెలుస్తోంది. తమిళంలో ఈ సినిమా ఆడియో లాంచ్ కు గెస్ట్ గా తలైవా రజినీకాంత్ ను ఆహ్వానించారని, తెలుగులో డార్లింగ్ ప్రభాస్ ని ఇన్వైట్ చేశారని టాక్ నడుస్తోంది. మరి ఈ వార్తలలో ఎంతవరకు నిజమందో తెలియాలంటే మేకర్స్ నుంచి అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చేదాకా వెయిట్ అండ్ సీ.


తలైవా అతిథిగా ఒప్పుకున్నాడా?

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వార్తల ప్రకారం తమిళంలో అత్యంత గ్రాండ్ గా జరగనున్న ‘కంగువ’ ఈవెంట్ కు రజినీకాంత్ ను మేకర్స్ ఇన్వైట్ చేశారని అంటున్నారు. కానీ ఇటీవలే ఆయన అనారోగ్యం కారణంగా రెస్ట్ మోడ్ లో ఉన్న విషయం తెలిసిందే. మరి నడుస్తున్న టాక్ ప్రకారం ఆయన గెస్ట్ గా హాజరవుతారా? అనేది తలైవాతో పాటు సూర్య అభిమానుల మదిలో ఉన్న ప్రశ్న.

ఎనిమిది భాషలో మూవీ రిలీజ్…

ఈ సినిమాను ఏకంగా ఎనిమిది భాషలో రిలీజ్ చేస్తుండడం అంచనాలను అమాంతం పెంచేసింది. తెలుగు, తమిళ, ఫ్రెంచ్, స్పానిష్, ఇంగ్లీష్ తో సహా మొత్తం ఎనిమిది భాషలో కంగువ’ మూవీ రిలీజ్ కాబోతోంది. ఇక ఈ మూవీని నైజాం ఏరియాలో బడా ప్రొడక్షన్ హౌస్ మైత్రి మూవీ మేకర్స్ వారు రిలీజ్ చేస్తున్నారు.  సింగపూర్ లో హోం స్క్రీన్, గల్ఫ్ దేశాల్లో ఫార్స్, అమెరికాలో ప్రత్యాంగిరా, యూకె లో యశ్ రాజ్ ఫిలిమ్స్ రిలీజ్ చేస్తుండగా… సినిమాను స్టూడియో గ్రీన్, యువి క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మించారు. ఈ మూవీకి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించారు.

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×