E-Paper
Advertisement

Kasthuri Shankar: కాళ్ళ బేరానికి వచ్చిన కస్తూరి.. నోటి దూలకు గట్టి దెబ్బే..!

Kasthuri Shankar: కాళ్ళ బేరానికి వచ్చిన కస్తూరి.. నోటి దూలకు గట్టి దెబ్బే..!
Advertisement

Kasthuri Shankar: ప్రముఖ నటి కస్తూరి శంకర్ (Kasthuri Shankar) ఇటీవల పొలిటికల్ ఈవెంట్ లో భాగంగా తెలుగువారిపై చేసిన కామెంట్లు తెలుగు తమ్ముళ్లను ఆగ్రహానికి గురిచేస్తున్నాయి. ” 300 ఏళ్ల క్రితం ఒక తమిళ రాజు అంతఃపురంలో రాణులకు సేవ చేయడానికి వెళ్లారు.అలాగే తెలుగు వారు కూడా తమిళనాడుకు వచ్చారు” అంటూ హేయమైన వ్యాఖ్యలు చేసింది కస్తూరి శంకర్. దీంతో తెలుగు సంఘాలు , తెలుగు ప్రజలు కస్తూరిని విమర్శిస్తున్నారు. ఈమె ఒక చరిత్ర హీనురాలు అని, ప్రతి విషయాన్ని వివాదంగా మార్చి వార్తల్లో నిలవాలని చూస్తోంది అని , వెంటనే తన వ్యాఖ్యలు వెనక్కి తీసుకొని, క్షమాపణలు చెప్పకపోతే లీగల్ గా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది అంటూ డిమాండ్ చేశారు.

తెలుగు వారిపై అనుచిత వ్యాఖ్యలు.. స్పందించిన కస్తూరి..

Advertisement

అయితే వెంటనే స్పందించిన కస్తూరి శంకర్..” తెలుగు వారు నా కుటుంబంతో సమానం. ఎవరిని కూడా నేను తప్పుగా ఉద్దేశించి మాట్లాడలేదు. దయచేసి నెగటివ్ గా నన్ను చూపించాలనుకోవద్దు. తెలుగు వారిపై నేను వ్యతిరేకంగా మాట్లాడాను అని విష ప్రచారం చేయడం సరైన పద్ధతి కాదు” అంటూ కూడా కామెంట్లు చేసింది. అయినా సరే ఒక తెలుగు వారిని బానిసలుగా చేసి మాట్లాడడం కరెక్ట్ కాదు అంటూ ఆమెపై నెటిజన్స్ మండిపడుతున్న నేపథ్యంలో.. తాజాగా తన ఎక్స్ ఖాతా ద్వారా మరో పోస్ట్ షేర్ చేసింది కస్తూరి శంకర్.

తెలుగువారికి క్షమాపణలు చెబుతూ పోస్ట్ షేర్ చేసిన కస్తూరి..

Advertisement

ఇక ఆమె ఒక లాంగ్ నోట్ వదులుతూ అందులో తెలుగువారికి క్షమాపణలు చెప్పింది. ఇక అందులో ఏముంది అనే విషయానికొస్తే.. ” గత రెండు రోజులుగా నేను బెదిరింపులతో పాటు దాడులు కూడా ఎదుర్కొంటున్నాను. అవి నా సంకల్ప బలాన్ని మరింత కఠినతరం చేస్తున్నాయి.. అయితే ఈరోజు నా అత్యంత గౌరవనీయమైన తెలుగు సోదరులు , తమిళనాడులో ఉన్న తెలుగు సోదరులు అలాగే తమిళనాడు బయట ఉన్న తెలుగు ప్రజలకు నేను మాట్లాడిన మాటలు ఆగ్రహాన్ని తెప్పించాయి. అయితే నేను చెప్పిన మాటలను కాస్త ఓపికగా ఆలోచిస్తే అందులో మీకు తప్పు అనిపించదు. నేను నిజమైన జాతీయవాదిని. నా భరతమాత ఏకత్వంలో భిన్నత్వం పట్ల అపారమైన గర్వం తో ఉన్నాను. ఎప్పుడూ కూడా కుల ప్రాంతీయ భేదాలకు అతీతంగానే జీవించాను. ముఖ్యంగా తెలుగువారితో ప్రత్యేక అనుబంధం వుండడం నా అదృష్టం. నేను నాయకరాజులు, కట్టుబొమ్మ నాయక, త్యాగరాజ కృతులు గానం చేసిన అద్భుతమైన రోజులను తలుచుకుంటూ ఉంటాను. తెలుగు ప్రజలే నాకు పేరు, కీర్తి, ప్రేమతో పాటు కుటుంబాన్ని కూడా అందించారు. అయితే నేను వ్యక్తపరిచిన అభిప్రాయాలు సందర్భానుసారంగా నిర్దిష్ట వ్యక్తులను మాత్రమే ఉద్దేశించినవి.. తెలుగు సమాజాన్ని ఉద్దేశించి నేను వ్యాఖ్యలు చేయలేదు. నా తెలుగు పెద్ద కుటుంబాన్ని బాధపెట్టడం లేదా కించపరచడం నా ఉద్దేశం కాదుm అన్ని రకాల స్నేహబంధాలను దృష్టిలో పెట్టుకొని మీరు నన్ను క్షమిస్తారని కోరుకుంటున్నాను. 2024 నవంబర్ 3 వ తేదీన ఒక మీటింగ్ లో నేను మాట్లాడిన మాటలు అన్నింటిని కూడా వెనక్కి తీసుకుంటున్నాను. దయచేసి తెలుగు ప్రజలు నన్ను క్షమిస్తారని కోరుకుంటున్నాను.. తమిళనాడులోని తెలుగు సోదరులు తమ పరువు కోసం జరిగే పోరాటంలో తమిళనాడు బ్రాహ్మణులకు అండగా నిలవాలని కూడా నేను కోరుతున్నాను.. జైహింద్”.. అంటూ తన పోస్ట్ ముగించింది కస్తూరి. ప్రస్తుతం ఈ పోస్ట్ కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంది ఇది చూసిన కొంతమంది నెటిజెన్స్ ఫస్ట్ నోటి దూల తగ్గించుకో.. మాటలన్నీ మాట్లాడి ఇప్పుడు కాళ్ళ బేరానికి వచ్చావా అంటూ కామెంట్ చేసినట్టు తెలుస్తోంది.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×