Mahesh Babu :టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు(Mahesh Babu) హీరోగా, శ్రీ లీల(Sreeleela), మీనాక్షి చౌదరి(Meenakshi Choudhary) ప్రధాన పాత్రల్లో ఈ ఏడాది సంక్రాంతి కానుకగా వచ్చిన చిత్రం ‘గుంటూరు కారం’. ప్రముఖ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas) దర్శకత్వం వహించిన ఈ చిత్రం మాస్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా భారీ అంచనాల మధ్య విడుదలైంది. కానీ బాక్సాఫీస్ వద్ద అనుకున్నంత స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేదు. కానీ ఒక వర్గం అభిమానుల హృదయాలలో మాత్రం ప్రత్యేక స్థానం సంపాదించుకుందని చెప్పవచ్చు. ప్రత్యేకించి ఈ చిత్రంలోని కొన్ని ఎలిమెంట్స్ సినిమా స్థాయిని ఊహించని స్థాయికి పెంచేసాయి.
వరల్డ్ వైడ్ రికార్డు సృష్టించిన కుర్చీ మడతపెట్టి..
ముఖ్యంగా ఈ సినిమాలోని పాటలు యూట్యూబ్లో ట్రెండ్ క్రియేట్ చేశాయి. అందులో ఒకటి “కుర్చీ మడత పెట్టి”. ఈ పాట ఊహించని స్థాయిలో క్రేజ్ సొంతం చేసుకుంది. ఈ పాటకు ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్.ఎస్.తమన్ (S.S.Thaman ) సంగీతం అందించగా.. రామజోగయ్య శాస్త్రి సాహిత్యం బాగా వర్కౌట్ అయింది. ఈ పాట విడుదలైన నాటి నుంచి యూట్యూబ్ లో దూసుకుపోతూ.. 2024 సంవత్సరానికి గానూ గ్లోబల్ టాప్ సాంగ్స్ లో ఒకటిగా నిలిచి, ప్రపంచవ్యాప్తంగా గుర్తింపును అందుకుంది. మనదేశంలోనే కాకుండా ఇతర దేశాలలో కూడా ప్రజాదారణ పొందింది అంటే, ఏ రేంజ్ లో ఈ పాట ప్రేక్షకులను ఆకట్టుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక ఈ పాట వ్యూస్ పరంగా మాత్రమే కాదు పాప్ కల్చర్ లో కూడా తనదైన ముద్ర వేసుకుంది. ఇప్పటివరకు 526 మిలియన్స్ కి పైగా వ్యూస్ రాబట్టింది ఈ పాట. పల్లెల నుంచి పట్టణాల వరకు కూడా అన్ని వర్గాల ప్రేక్షకులను ఈ పాట విపరీతంగా ఆకట్టుకుంది. ఇందులో మహేష్ బాబు మేనరిజం, స్టైల్, లుక్ అన్నీ కూడా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి.
కాలాపాషా నుంచీ పుట్టుకొచ్చిందే ఈ పాట..
ఇకపోతే “కుర్చీ మడత పెట్టి” పాట సోషల్ మీడియాలో కాలాపాషా అనే ఒక వ్యక్తి నుంచి పుట్టుకొచ్చిన విషయం తెలిసిందే. త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన సినిమాలలో సాంగ్స్ ఎప్పుడూ కూడా ప్రత్యేకంగా ఉంటాయని ఈ సాంగ్ తో మరొకసారి నిరూపణ అయింది. హారిక హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మించిన ఈ చిత్రానికి సంబంధించి ప్రమోషనల్ కంటెంట్ కూడా సినిమాపై ఆసక్తిని పెంచిందనడంలో సందేహం లేదు. ఏది ఏమైనా మహేష్ బాబు ఈ పాటతో వరల్డ్ వైడ్ రికార్డు క్రియేట్ చేశారని చెప్పవచ్చు.
మహేష్ బాబు సినిమాలు..
సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో ఎస్ఎస్ఎంబి 29 అనే సినిమా చేస్తున్నారు. ఈ సినిమా కోసం దాదాపు మూడేళ్ల సమయాన్ని కేటాయించినట్లు తెలుస్తోంది. ఇకపోతే ఈ మూడు సంవత్సరాలలో మహేష్ బాబు నుంచి మరో మూవీ రాదని స్పష్టం అవుతుంది. ఇక ఇందులో ప్రముఖ హాలీవుడ్, బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా (Priyanka Chopra)హీరోయిన్గా అవకాశాన్ని అందుకున్నట్లు సమాచారం. ఈ సినిమాను రూ.1000 కోట్ల బడ్జెట్ తో కే.ఎల్. నారాయణ నిర్మిస్తున్నారు.