E-Paper
Advertisement

Rashmika Mandanna : డీప్ ఫేక్ ఎఫెక్ట్… టాప్ పొజిషన్‌ను దక్కించుకున్న నేషనల్ క్రష్

Rashmika Mandanna : డీప్ ఫేక్ ఎఫెక్ట్… టాప్ పొజిషన్‌ను దక్కించుకున్న నేషనల్ క్రష్
Advertisement

Rashmika Mandanna : కొన్ని రోజుల క్రితం పాన్ ఇండియా హీరోయిన్ రష్మిక మందన్న డీప్ ఫేక్ వీడియో ఒకటి నెట్టింట దుమారం రేపిన సంగతి గుర్తుండే ఉంటుంది. అయితే దీని ఎఫెక్ట్ కారణంగా తాజాగా రష్మిక మందన్న ఒక టాప్ పొజిషన్ ను దక్కించుకుంది. మరి ఆమె దక్కించుకున్న ఆ టాప్ పొజిషన్ ఏంటి? అనే వివరాల్లోకి వెళితే…

సైబర్ క్రైమ్ సెంటర్ కు బ్రాండ్ అంబాసిడర్

Advertisement

తన అందం, అభినయంతో నేషనల్ క్రష్ అనే బిరుదును దక్కించుకున్న కన్నడ బ్యూటీ రష్మిక మందన్న తాజాగా ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ కు బ్రాండ్ అంబాసిడర్ గా నియమితులవ్వ డం విశేషం. ఈ విషయాన్ని స్వయంగా కేంద్ర హోంశాఖకు సంబంధించిన సైబర్ దోస్త్ విభాగం ప్రకటించింది. అలాగే రష్మిక మందన్న కూడా ఓ స్పెషల్ వీడియోను రిలీజ్ చేసి అందులో తాను గతంలో ఎదుర్కొన్న డీప్ ఫేక్ గురించి ప్రస్తావించడం గమనార్హం. ఆ వీడియోలో రష్మిక మాట్లాడుతూ కొన్ని నెలల క్రితం తన డీప్ ఫేక్ వీడియో వైరల్ గా మారిన సంగతిని గుర్తు చేసింది. అది సైబర్ క్రైమ్ అంటూ ఆ చేదు ఎక్స్పీరియన్స్ తర్వాత తను సైబర్ క్రైమ్ కు వ్యతిరేకంగా పోరాడాలని నిర్ణయించుకున్నానని, అందరికీ ఈ విషయం గురించి అవగాహన కల్పించాలని అనుకున్నానని వెల్లడించింది. ఇక ఇప్పుడు సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ కు తాను బ్రాండ్ అంబాసిడర్ అని చెప్పడానికి సంతోషిస్తున్నాను అంటూ అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పింది. కాగా ఈ శాఖ కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పని చేస్తుంది. ‘సైబర్ నేరస్థులు మనల్ని టార్గెట్ చేయడానికి ఎప్పుడూ రెడీగా ఉంటారు. కాబట్టి మనం అలర్ట్ గా ఉంటూ వాళ్ళ నుంచి మనల్ని మనం కాపాడుకోవాలి. సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ బ్రాండ్ అంబాసిడర్ గా నేను ఇలాంటి నేరాలపై ప్రజలకు అవగాహన కలిగిస్తాను. దేశాన్ని సైబర్ క్రైమ్ నేరాల నుంచి కాపాడుతాను’ అంటూ రష్మిక మందన్న హామీ ఇచ్చారు.

రష్మిక మందన్న డీప్ ఫేక్ వివాదం

Advertisement

కాగా గతంలో రష్మిక మందన్న డీప్ ఫేక్ వీడియో సంచలనంగా మారిన విషయం తెలిసిందే. జారా పటేల్ అనే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ వీడియోకు రష్మిక ముఖాన్ని ఏఐ ఉపయోగించి ఎడిట్ చేశారు. ఆ వీడియో చూడడానికి అభ్యంతరకరంగా ఉండడంతో క్షణాల్లోనే వైరల్ గా మారింది. ఈ విషయంపై ముందుగా అమితాబ్ బచ్చన్ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఆ తర్వాత రష్మిక మందన్న ఇలాంటి వీడియోల వల్ల టెక్నాలజీ అంటేనే భయంగా ఉందంటూ ఆవేదన వ్యక్తం చేసింది. అంతేకాకుండా సైబర్ క్రైమ్ కు ఫిర్యాదు చేయగా,  రష్మిక వీడియోపై పలువురు సినీ ప్రముఖులు ఫైర్ అయ్యారు. ఇక సదరు నిందితుడిని పోలీసులు అరెస్ట్ కూడా చేశారు. ఆ తర్వాత ఎంతోమంది సినీ, క్రీడా ప్రముఖుల డీప్ ఫేక్ వీడియోలు ఎప్పటిలాగే వైరల్ అయ్యాయి. ఈ నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వం ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకుంది.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×