E-Paper
Advertisement

Mass Jathara: మాస్ జాతర రిలీజ్ డేట్ లాక్.. గణేష్ ఉత్సవాలు థియేటర్లో..!

Mass Jathara: మాస్ జాతర రిలీజ్ డేట్ లాక్.. గణేష్ ఉత్సవాలు థియేటర్లో..!
Advertisement

Mass Jathara..టైర్ -1 హీరోలలో ఒకరిగా పేరు సొంతం చేసుకున్న మాస్ మహారాజా రవితేజ (Raviteja) గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. తన అద్భుతమైన నటనతో.. విలక్షణ నటుడిగా పేరు సొంతం చేసుకున్న ఈయన అతి తక్కువ సమయంలోనే భారీ పాపులారిటీ అందుకున్నారు. ఇప్పుడు ఏడుపదుల వయసులో కూడా వరుస సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్న ఈయన.. తాజాగా ‘మాస్ జాతర’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. భాను భోగవరపు (Bhanu Bhogavarapu) దర్శకత్వంలో శ్రీ లీలా(SreeLeela ) హీరోయిన్గా, రవితేజ హీరోగా వస్తున్న ఈ చిత్రం విడుదల కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు తాజాగా ఈ సినిమా విడుదల తేదీని ప్రకటిస్తూ.. మేకర్స్ పోస్టర్ తో సహా తెలియజేయడమే కాకుండా అటు హీరో రవితేజ కూడా తన ఇంస్టాగ్రామ్ వేదికగా అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇచ్చారు.

‘మాస్ జాతర’ రిలీజ్ డేట్ లాక్..

Advertisement

మాస్ జాతర సినిమా వినాయక చవితి సందర్భంగా ఆగస్టు 27న విడుదల కానుంది. రవితేజ నుంచి అభిమానులు, ప్రేక్షకులు కోరుకునే మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీగా ఈ సినిమా రూపొందుతోంది. వింటేజ్ వైబ్స్, కమర్షియల్ హంగులతో థియేటర్లలో మాస్ పండుగను తీసుకురానుంది. ఇప్పటివరకు ఈ సినిమా నుండి విడుదల చేసిన పాటలు, పోస్టర్లు సినిమాపై అంచనాలను భారీగా పెంచేసాయి. ఈ సినిమా నుండి విడుదలైన మొదటి జీతంతో ‘తూ మేరా లవర్’ పాట అందరిని ఉర్రూతలూగించింది. ‘ఇడియట్’ సినిమాలోని ‘చూపులతో గుచ్చి గుచ్చి చంపకే’ పాటకు ట్రిబ్యూట్ గా మలిచిన ‘తూ మేరా లవర్’ గీతం అభిమానులకు విందు భోజనంలా అనిపించింది. ఇందులో శ్రీ లీల అదరగొట్టేసింది. ఇదివరకే వీరిద్దరి కాంబినేషన్లో ‘ధమాకా’ సినిమా మంచి విజయాన్ని అందుకోగా.. ఇప్పుడు మరొకసారి బాక్సాఫీస్ వద్ద మెరుపులు మెరిపించడానికి సిద్ధమవుతున్నారు.

ఈసారి గణేష్ ఉత్సవాలు థియేటర్లలో..

Advertisement

ధమాకా సినిమాకు సంగీతాన్ని అందించిన భీమ్స్ సిసిరోలియో మరోసారి సంచలనం సృష్టించడానికి సిద్ధమయ్యారు. కాకపోతే సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్, శ్రీకర స్టూడియోస్ నిర్మాణ బ్యానర్లపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ వినాయక చవితి సందర్భంగా థియేటర్లలో మాస్ పండుగను తీసుకొచ్చి అభిమానుల దాహాన్ని తీర్చడానికి సిద్ధమవుతున్నారు. అంతేకాదు వినాయక చవితి ఉత్సవాలను థియేటర్లలో ఆగస్టు 27న జరుపుకుందాం అంటూ రవితేజ తన ఇంస్టాగ్రామ్ ద్వారా తెలియజేశారు. ఇక ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అభిమానులు ఎంతగానో ఎదురు చూసిన ఎదురుచూపుకు చిత్ర బృందం ఎట్టకేలకు తెరదించింది. ఇక ఈ సినిమా సాంకేతిక బృందం విషయానికి వస్తే.. జాతీయ అవార్డు గ్రహీత నవీన్ నూలి ఎడిటర్ గా వ్యవహరిస్తున్నారు. సినిమాటోగ్రాఫర్ గా విధు అయ్యన్న.. ఎగ్జిక్యూటివ్ నిర్మాతగా ఫన్నీ కే వర్మ పనిచేస్తున్నారు. ఇక పీఆర్ఓగా లక్ష్మీ వేణుగోపాల్ వ్యవహరిస్తున్నారు. మొత్తానికైతే ధమాకాతో భారీ సక్సెస్ అందుకొని, ఇప్పుడు మళ్లీ అదే కాంబో ‘మాస్ జాతర’ అంటూ రాబోతోంది. మరి థియేటర్లలో ఎటువంటి మాస్ క్రియేట్ చేస్తారో చూడాలి.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×